వరంగల్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ నేతలకు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే కేంద్రంతో కొట్లాడి వడ్లను కొనిపించాలన్నారు. తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఆందోళనలు, పోరాటాలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపిపి, జడ్పిటీసి, మున్సిపల్ చైర్మన్, సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, పార్టీ శ్రేణులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.