శాయంపేట, అక్టోబర్ 5 : సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని వరంగల్ జిల్లాపరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని వసంతాపూర్, గంగిరేణిగూడెం, కొప్పుల, జోగంపల్లి, మైలారం, పెద్దకోడెపాక, గోవిందాపూర్, సూరంపేట, గట్లకానిపర్తి, నర్సింహులపల్లి గ్రామాల్లో శుక్రవారం బతుకమ్మ చీరెలు, యువకులకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో గండ్ర జ్యోతి మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చుతున్నారన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మరొకసారి కేసీఆర్ను ఆశీర్వదించాలన్నారు. తొమ్మిదేళ్లలో జరిగిన పురోగతిని కళ్లారా చూస్తున్నామన్నారు. మిషన్ కాకతీయతో జలకళ సంతరించుకున్నాయన్నారు. పింఛన్లు పెంచిన ఘనత కేసీఆర్దేనన్నారు. విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్యను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివి ఇంజినీర్లు, డాక్టర్లుగా ఎదుగుతున్నారన్నారు. వరంగల్లో సూపర్స్పెషాలిటి ఆస్పత్రిని కట్టిస్తున్నామన్నారు.
రైతులకు రైతుబంధు, బీమా అందిస్తున్నామని, రైతుల పంటను కొనుగోలు చేస్తున్నామన్నారు. రూ.లక్ష రుణమాఫీ చేశామన్నారు. ప్రేమతో ఇచ్చే వాటిని తీసుకోవాలన్నారు. బతుకమ్మ చీరెలకు వెల కట్టవద్దని తెలిపారు. చీరెలు నాణ్యతగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏదో చేస్తామని గ్రామాల్లోకి వచ్చి చెబుతున్నారని, వారి మాటలను నమ్మొవద్దన్నారు. వీరి రాష్ర్టాల్లో తెలంగాణలో అమలువుతున్న పథకాలు ఉన్నాయా..? అని అడగాలని అన్నారు. ఓట్ట కోసం చెప్పే మాయమాటలు నమ్మొద్దన్నారు. మంచి చేసే సర్కారుకు అండగా ఉండి మరోసారి కేసీఆర్ను సీఎం చేయాలని అన్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువత క్రీడా సామగ్రిని సద్వినియోగం చేసుకుని సాధన చేసి క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వైస్ఎంపీపీ రాంశెట్టి లతాలక్ష్మారెడ్డి, ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో రూ.6కోట్లతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు పనులను వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి శుక్రవా రం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో ఎనలేని అభివృద్ధి జరిగిందన్నారు. అనంతరం గంగిరేణిగూడెంలో పోతరాజు రాధికకు సీఎం సహాయ నిధి కింద రూ.18వేలు మంజూరుకావడంతో చెక్కును జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మనోహర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.