స్టేషన్ ఘన్పూర్, జనవరి 28 : కేంద్ర ప్రభుత్వం వరంగల్కు 2016లో మం జూరు చేసిన సైనిక్ స్కూల్ను తరలిస్తే సహించేది లేదని మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దీనిని వెంటనే అడ్డుకోకుంటే ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆదివారం స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనే లక్ష్యం తో అనేక విద్యాసంస్థలను ఇక్కడ కేటాయించిందని తెలిపారు. తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్కు వెటర్నరీ, అగ్రికల్చర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్ తీసుకొచ్చానని గుర్తుచేశారు. హెల్త్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చామని, సైనిక్ స్కూల్ మాత్రమే ఇంకా ప్రారంభం కాలేదన్నారు. 2016 లో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఒక సైనిక్ స్కూల్ను మంజూరు చేస్తే నాటి సీఎం కేసీఆర్ దీనిని వరంగల్కు కేటాయించారని వివరించారు. ఇందుకోసం ధర్మసాగర్ మండలం ఎలుకుర్తిలో 49.32 ఎకరాల స్థలాన్ని గుర్తించామన్నారు. దీనిపై 2015 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వంతో కేం ద్ర రక్షణ శాఖకు అంగీకారం కుదుర్చుకొని ఒప్పందం చేసుకుందన్నారు.
ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రాష్టానికి మరో సైనిక్ స్కూల్ కావాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిసిందని ఆయన తెలిపారు. దేశంలోని వివిధ రా ష్ర్టాలకు కేంద్రం కొత్తగా 100 సైనిక్ స్కూ ళ్లను మంజూరు చేయాలని ఆలోచిస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. కానీ మన రాష్ర్టానికి కొత్తగా సైనిక్ స్కూల్ ఇచ్చేందుకు సంసిద్ధంగా లేకపోవడం వల్ల గతంలో వరంగల్కు మంజూరైన సైనిక్ స్కూల్ను కంటోన్మెంట్లో ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇందులో భాగంగా 50 ఎకరాల స్థలం కేటాయించాలని విద్యాశాఖ కంటోన్మెంట్ బోర్టుకు ప్రతిపాదనలు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సైనిక్ స్కూల్ను ఎలుకుర్తిలో ఏర్పాటుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన పలుకుబడితో మరో సైనిక్స్కూల్ మంజూరు చేయించి ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు కొత్తగా విద్యాసంస్థలు తీసుకురాకపోయినా పర్వాలేదు కానీ, వరంగల్లో విద్యావకాశాలు మెరుగుపడేలా చూడాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో, అమలు కాని 420 హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వాటి ని నెరవేర్చేందుకు రూ.లక్ష కోట్లు అవసరమని, ఈ పరిస్థితుల్లో కొత్త పనులు చేపట్టకపోయినా పర్వాలేదు కానీ, గత ప్రభుత్వం ప్రారంభించిన, మంజూరు చేసిన పనులను పూర్తిచేయాలని కడియం సూచించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో సీఆర్ఆర్, ఎంఆర్ఆర్, సీడీపీ, పీఎంజీఎస్వై కింద రూ.200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఒక్కో భవనానికి గిరిజన సంక్షేమ శాఖ నుంచి రూ.20 లక్షల చొప్పున, గ్రామాలకు లింకురోడ్లు, స్టేషన్ఘన్పూర్లో బంజా రా భవన నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేశామన్నారు. కేవలం గిరిజన సంక్షేమ శాఖ నుంచే రూ.78.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మొత్తం రూ.278.50 కోట్లతో పలు శాఖల పనులుండగా వీటిలో కొన్ని వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
సర్పంచ్ల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని కడియం కోరారు. సర్పంచులు గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని, వీటిని ప్రారంభించే సమయానికి వారి పదవీ కాలం ముగుస్తుందన్నారు. పనులు ప్రారంభించాలని సర్పంచ్లు కోరుతుంటే వీలు చూసుకుని వస్తామని మంత్రులు చెబుతున్నారని విమర్శించారు. జీపీలకు ప్రత్యేకాధికారులను నియమించి స్థానిక సంస్థలను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఎన్నికలు జరిగే వరకు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులను కొనసాగించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, రాపోలు మధుసూదన్రెడ్డి, బూర్ల శంకర్, నీల గట్టయ్య, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, రజాక్ యాదవ్, వెంకటస్వామి, గట్టు రమేశ్, కందుల గట్టయ్య, రఘునాథపల్లి మం డల అధ్యక్షుడు వారాల రమేశ్, సొసైటీ డైరెక్టర్ తోట సత్యం, జీడి రమేశ్, కనకం రమేశ్, మాజీ ఎంపీటీసీ గుర్రం ఫాతికుమార్, ఐలోని సుధాకర్, కడియం యువసేన అధ్యక్షుడు జీడి ప్రసాద్, సంపత్ రాజ్, పద్మారెడ్డి పాల్గొన్నారు.