పరకాల, డిసెంబర్ 19: అభివృద్ధికి, సంక్షేమానికి కేరాఫ్ తెలంగాణ రాష్ట్రం అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల మున్సి పాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన 112 మందికి రూ.1.22కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డల పెళ్లిళ్లు భారమైన నేపథ్యంలో పేదల కష్టాలను చూసిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. కానీ పేదల జీర్ణించుకోలేని విపక్షాలు ఆయా పథకాలను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. వారు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలోని పథకాలు అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, తహసీల్దార్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
క్రిస్మస్ కానుకల పంపిణీ
నియోజకవర్గ పరిధిలోని పరకాల, ఆత్మకూరు, నడికూడ, దామెర మండలాలకు చెందిన క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పంపిణీ చేశారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మతాలకతీతంగా పరిపాలిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నిరుపేదలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
సమస్యలను పరిష్కరించాలి
ప్రజాప్రతినిధులు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో గీసుకొండ మండలం అనంతారం, బొడ్డుచింతలపల్లి, ఎలుకుర్తి, కొమ్మాల, కొనాయిమాకుల, మనుగొండ, ఊకల్, విశ్వనాథపురం, దస్రుతండా, హార్జ్యతండా, సూన్యతండా సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారని, అవసరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి పథంలో నిలుస్తున్నాయని తెలిపారు. పల్లె ప్రగతిలో గ్రామాల రూపురేఖలు మారాయని, స్ఫూ ర్తితో ప్రజాప్రతినిధులు ముందుకునడువాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, సర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.