వర్ధన్నపేట, జూన్ 2: పోరాటాల ద్వారా సా ధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నా యకత్వంలో దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆద ర్శంగా నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూ రి రమేశ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు, మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడేళ్లలో నిధులు, నీళ్ల విషయంలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. ఈ సందర్భంగా మిఠా యిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, మాజీ జడ్పీటీ సీ పాలకుర్తి సారంగపాణి, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.