సుబేదారి, జూలై 14 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్పెక్టర్ బదిలీల్లో భరోసా సెంటర్లో పనిచేస్తున్న సువర్ణను సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్కు, సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కుమారస్వామిని వీఆర్కు బదిలీ చేశారు. వీఆర్లో ఉన్న కొండ్రు సుజాతను కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు, పీసీఆర్లో విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రామ్ను వీఆర్కు బదిలీ చేశారు.
13 మంది ఎస్ఐల బదిలీలలో ఎల్కతుర్తిలో పని చేస్తున్న పరమేశ్వర్ను వీఆర్కు బదిలీ చేయగా, హనుమకొండలో పని చేస్తున్న రాజ్కుమార్ను ఎల్కతుర్తికి బదిలీ చేశారు. ధర్మసాగర్లో పనిచేస్తున్న సాయిబాబును ముల్కనూర్కు, ముల్కనూర్లో పనిచేస్తున్న మహేందర్ను మామునూరుకు బదిలీ చేశారు. రాయపర్తిలో విధులు నిర్వర్తిస్తున్న రాజును మడికొండ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. వీఆర్ అటాచ్లో ఉన్న సాయిప్రసన్నకుమార్ను ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. మిల్స్కాలనీ పనిచేస్తున్న కుమార్ను మట్టెవాడకు బదిలీ చేశారు. వర్ధన్నపేటలో పనిచేస్తున్న మంగను భరోసా సెంటర్కు బదిలీ చేశారు. మిల్స్కాలనీలో పనిచేస్తున్న సాంబయ్యను సుబేదారి పోలీస్ స్టేషన్కు, మామునూరులో విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్రెడ్డిని ఆత్మకూర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దేవురుప్పులలో పనిచేస్తున్న రమేశ్ను పరకాల పోలీస్ స్టేషన్కు బదిలీ చేయగా, వీఆర్ అటాచ్లో ఉన్న శ్వేతను గీసుగొండ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. పరకాలలో పనిచేస్తున్న హరికృష్టను వీఆర్కు బదిలీ చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది 29 మందికి రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. వీరిలో సీసీఆర్లో పని చేస్తున్న వెంకట్రామ్కు మహోన్నత సేవా పతకం లభించింది. గతంలో సీసీఆర్బీలో పనిచేసిన ఏసీపీ ప్రతాప్కుమార్కు ఉత్తమ సేవాపతకం దక్కింది. వీరితో పాటు మరో 27 మంది పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలు లభించాయి.