కరీమాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మహనీయులకు తగిన గుర్తింపు లభిస్తున్నదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం వరంగల్ కలక్టరేట్లో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడకల్లో పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే కవులు, కళాకారుల జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వారందరినీ మనం స్మరించుకుంటున్నామన్నారు.
బోయవాడైన వాల్మీకి కవిగా మారి వాల్మీకి రామాయణ కావ్యం రచించిన మహానుభావుడని తెలిపారు. వాల్మీకి రచించిన రామాయణం మనిషి ఉన్నంత వరకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గోపి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.