నమస్తే నెట్వర్క్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం 11.30 గంటలకు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. అంతేకాకుండా ప్రయాణికులు, వాహనదారులు, వ్యవసాయదారులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఎక్కడివారక్కడే జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటారు. నర్సంపేటలోని వరంగల్రోడ్డు కూడలిలో పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ గీతాలాపనలో నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్, సీఐ సూర్యప్రసాద్, తాసిల్దార్ రామ్మూర్తి, ఎస్సై రవీందర్ పాల్గొన్నారు. అలాగే, నర్సంపేటలోని రామాలయం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో జాతీయ గీతాలాపన తర్వాత నినాదాలు చేశారు. హెచ్ఎం వర్దెల్లి సతీశ్కుమార్, టీచర్ రవీందర్, అంగన్వాడీ టీచర్ నల్లా భారతి, తదితరులు పాల్గొన్నారు. ఖానాపురం మండలంలోని కూడళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 11.30 గంటలకు చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతమైంది. మండలకేంద్రంలోని రెండో బస్టాండ్ సెంటర్లో 365 జాతీయ రహదారిపై ఎస్సై పిట్టల తిరుపతి ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, వాహనదారులు పెద్దత్తున హాజరై జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, ఎంపీడీవో సుమనవాణి పాల్గొన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి సెంటర్లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దుగ్గొండి పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, గిర్నిబావిలోని ఎంజేపీటీ గురుకుల విద్యాలయం, న్యూవిజన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఎస్సై వంగల నవీన్కుమార్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎంపీడీవో గోల్కొండ కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, ఎంజేపీటీ ప్రత్యేకాధికారి దేవేందర్, న్యూవిజన్ హెచ్ఎం మహిపాల్రెడ్డి, గిర్నిబావి సర్పంచ్ కూస సమతారాజు పాల్గొన్నారు. వెంకటాపురంలో మందపల్లి పీఏసీఎస్ చైర్మన్ ఊరటి మహిపాల్రెడ్డి వ్యవసాయ పొలంలో పని చేస్తున్న కూలీలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. రేఖంపల్లికి చెందిన రైతు ఓలిగె నర్సింగరావు తన వరి నారు మడిలో 75వ సంఖ్య ఆకృతిని ఏర్పాటు చేసి దేశభక్తిని చాటారు.
వ్యవసాయ కూలీలు సైతం..
నల్లబెల్లి మండలంలో సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేసింది. మూడుచెక్కలపల్లెలో ఉదయం 11.30 గంటలకు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కూలీలు సైతం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్, తాసిల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజయ్కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, ఎస్సై నార్లాపురం రాజారాం, సర్పంచ్ రాజారాం పాల్గొన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ప్రజలంతా ఒకచోటుకు చేరడంతో వర్ధన్నపేటలో సందడిగా మారింది. జాతీయ రహదారికి వైపులా వాహనాలు నిలిచిపోయాయి. అలాగే, ఎంపీడీవో కార్యాలయం ఆవరణతోపాటు అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, తాసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు పాల్గొన్నారు. గీసుగొండ మండలవ్యాప్తంగా, వరంగల్ 15వ డివిజన్ ధర్మారంలో సాముహిక జాతీయ గీతలాపాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, తాసిల్దార్ సుహాసిని, సీఐ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ప్రభాకర్, ఎంఈవో సత్యనారాయణ, ఏవో హరిప్రసాద్బాబు, సర్పంచ్లు అల్లం బాలిరెడ్డి, గోనె మల్లారెడ్డి, జైపాల్రెడ్డి, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
నెక్కొండలో అంబేద్కర్ కూడలిలో తాసిల్దార్ డీఎస్ వెంకన్న, సీఐ హథీరాం, ఎస్సై సీమ ఫర్హీన్, సర్పంచ్ సొంటిరెడ్డి యమున రంజిత్రెడ్డి, ఎంపీడీవో సుగుణకుమార్, ఎంపీవో రవి, డీటీ రాజ్కుమార్, ఎంఈవో రత్నమాల, కార్యదర్శి సదానందం తదితరులు జాతీయ గీతాన్ని ఆలపించారు. చెన్నారావుపేట జీపీ ఎదుట ఎస్సై తోట మహేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. ఎల్లాయగూడెం, లింగాపురం, పత్తినాయకతండాలో సర్పంచ్లు, అధికారులు, ప్రజలు జాతీయ గీతాలాపన నిర్వహించారు. వైస్ఎంపీపీ కృష్ణారెడ్డి, సర్పంచ్ కుండె మల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, ఇన్చార్జి ఎంపీడీఓ దయాకర్, ఎంఈవో అనిల్, కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాలు జరిగాయి. మహేశ్వరంలో ఎంపీపీ మోతె కళావతి, ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్, ఐకేపీ ఏపీఎం కుందేళ్ల మహేందర్, సర్పంచ్ మాడ్గుల కవిత పాల్గొన్నారు. కమ్మపల్లిలో జడ్పీటీసీ కోమాండ్ల జయ, సర్పంచ్ రంగారెడ్డి పాల్గొన్నారు. అలాగే, రామవరం, ఇటుకాలపల్లి, చంద్రయ్యపల్లి, గురిజాలలో సర్పంచ్ల ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అలాగే, విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. పర్వతగిరి సెంటర్లో సామూహిక జాతీయ గీతాలాపానలో తాసిల్దార్ కోమీ, ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, సీఐ శ్రీనివాస్, జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, సర్పంచ్ మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీవో శ్రీనివాస్, ఎంపీటీసీలతోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. చింతనెక్కొండలో ఉపసర్పంచ్ దర్నోజు దేవేందర్ వ్యవసాయ క్షేత్రంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు.
గ్రామగ్రామాన జాతీయ గీతాలాపన
రాయపర్తిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సామూహిక జాతీయ గీతాలాపనను ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, సర్పంచ్ గారె నర్సయ్య, తాసిల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్ సారథ్యంలో నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. అలాగే, మండలంలోని అన్ని గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంగెంలోని అంబేద్కర్ కూడలితోపాటు గ్రామాల్లోని కూడళ్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున్న గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీఆర్ఎన్తండాలో వ్యవసాయ కూలీలు వరి నాటు వేసేచోటే తిరంగా జెండాలతో గీతాలాపన చేశారు. ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, తాసిల్దార్ రాజేంద్రనాథ్, ఎంపీడీవో మల్లేశం, ఎస్సై పెండ్యాల దేవేందర్, ఏవో యాకయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.