నర్సంపేట/దుగ్గొండి/నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/ఖానాపురం/వర్ధన్నపేట/పోచమ్మమైదాన్/ పర్వతగిరి/సంగెం, ఆగస్టు 12: సోదరభావానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కా చెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి వేడుకలు చేసుకున్నారు. అలాగే, ప్రజాప్రతినిధులకు మహిళలు రాఖీలు కట్టి ఆత్మీయతను చాటారు.
నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకురాలు నల్లా భారతి రాఖీ కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా నర్సంపేటలో పండుగ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోయాయి. లీడ్ గ్రంథాలయంలో వ్యవస్థాపకుడు రవికుమార్ పుస్తకాలకు రాఖీలు కట్టారు. లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ అండ్ లిటరరీ సెంటర్లో వినూత్నంగా రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. దుగ్గొండి మండలంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్కు సోదరీమణులు రాఖీలు కట్టి ఆశీర్వదించారు.
నర్సంపేట మండలంలో రక్షాబంధన్ సందర్భంగా కిరాణా దుకాణాలు, స్వీట్ హౌస్లు, బస్సులు, ఆటోలు, జీపులు కిటకిటలాడాయి. చెన్నారావుపేటలోని కేజీబీవీలో స్థానిక నాయకులు రక్షా బంధన్ వేడుకలు నిర్వహించారు. పాఠశాల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో నాయకులందరికీ విద్యార్థినులు రాఖీలు కట్టారు. వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు బహుమతిగా ఆట సామగ్రిని అందజేస్తామని హామీ ఇచ్చారు. లింగాపురంలోని అంగన్వాడీ సెంటర్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధ ఆధ్వర్యంలో పిల్లలు సర్పంచ్ రమేశ్కు రాఖీలు కట్టారు. సోదరభావానికి ప్రతీక నిలిచే రాఖీ వేడుకలను ఖానాపురం మండలవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.
ప్రతి ఇంట్లో అన్నదమ్ముళ్లకు అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఆంగోత్ అరుణ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. కమిషనర్ గొడిశాల రవీందర్తోపాటు కౌన్సిలర్లకు ఆమె రాఖీలు కట్టారు. అనంతరం ఫ్రీడమ్ రక్షాబంధన్ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇల్లంద కేజీబీవీలోలో ఫ్రీడమ్ రక్షాబంధన్ నిర్వహించారు. జాతీయ పతాకాలతో విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థినులు ప్రజాప్రతినిధులకు రాఖీలు కట్టారు. జడ్పీటీసీ మార్గం భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ కొత్తవాడ వాసవీకాలనీలోని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయా విశ్వవిద్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. వాసవీ కాలనీ బ్రాంచ్ ఇన్చార్జి బీకే వైష్ణవి ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి విశిష్టతను వివరించారు. యువ నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఆటోనగర్లోని లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలలో రాఖీ సంబురాలు నిర్వహించారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ బొట్టు కమలాకర్-మమత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పౌండేషన్ అధ్యక్షుడు కొత్తకొండ అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి మండలం వడ్లకొండలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు అమడగాని రాజుకు ఎంపీటీసీ అత్తి రేవతి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. గోరుగుట్టతండాలో సర్పంచ్ బానోత్ వెంకన్ననాయక్ నేతృత్వంలో సామూహిక రక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించారు. స్పెషలాఫీసర్ రవీందర్రాజు, కార్యదర్శి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. పర్వతగిరిలో సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు నేతృత్వంలో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. సంగెం మండలంలో రక్షాబంధన్ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సుల్లో తరలివెళ్లి అన్నదమ్ములకు రాఖీలు కట్టారు. దీంతో సందడి నెలకొంది.
రాఖీలు కట్టిన మహిళా కానిస్టేబుళ్లు
గీసుగొండ/రాయపర్తి: గీసుగొండ మండలవ్యాప్తంగా రాఖీ వేడుకలను నిర్వహించారు. గీసుగొండ పోలీస్స్టేషన్లో మహిళా కానిస్టేబుళ్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకన్న, సందీప్కుమార్, కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. రాయపర్తి మండలంలోని 39 గ్రామాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సారథ్యంలో తిర్మలాయపల్లిలోని కేజీబీవీలో విద్యార్థినులు, మహిళా సిబ్బంది ప్రజాప్రతినిధులు, నాయకులకు రాఖీలు కట్టారు. జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రెంటాల గోవర్ధన్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అయిత రాంచందర్, రామ్యాదవ్, సతీష్యాదవ్, గురుకుల స్పెషలాఫీసర్ బుర్ర కవిత, ప్రమీల పాల్గొన్నారు.