వరంగల్, మే 19 : సమస్యలపై బల్దియా సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. ముందుగా నగర తాగునీటి సమస్యలపై ఇంజినీరింగ్ అధికారులపై మండిపడ్డారు. పైపులైన్ లీకేజీల మరమ్మతులు చేయడం లేదని వాపోయారు. కాశీబుగ్గ, ఎల్బీనగర్, చింతల్, శివనగర్, పుప్పాలగుట్ట ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉందని కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. బల్దియా కౌన్సిల్ సమావేశంలో తాగునీటి సమస్యపై వాడీవేడి చర్చిచారు. గురువారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. లీకేజీలు, వైకుంఠధామాలు, పట్టణ ప్రగతి, హరితహారంపై చర్చించారు. మూడు విడుత పట్టణ ప్రగతి నిధుల్లో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కౌన్సిల్లో పవర్పాయింట్ ప్రదర్శన ద్వారా సభ్యులకు వివరించారు. డివిజన్ల వారీగా సమస్యలను కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో నగరంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సభ్యులు సభలో డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పనులు పర్యవేక్షణ చేస్తున్న పబ్లిక్ హెల్త్ అధికారులు తీరుతో తాగునీటి సమస్య తీవ్రమవుతున్నదని సభ్యులు ఆరోపించారు. స్పందించిన మేయర్ సుధారాణి తాగునీటి సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. లీకేజీలు యుద్ధ్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎజెండా అంశాలకు సమావేశంలో అమోదం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు విడుతల పట్టణ ప్రగతిపై కౌన్సిల్ సమావేశంలో పవర్పాయింట్ ప్రజంటేషన్ చేశారు. మూడు విడుత నిధులతో గ్రేటర్ కార్పొరేషన్లో చేపట్టిన అభివృద్ధ్ది పనులను పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సభ్యులకు వివరించారు. అయితే పట్టణ ప్రగతి పనులు చాల వరకు జరుగలేదని పలువురు సభ్యులు సభలో ఆరోపించారు. జూన్ 3 నుంచి చేపట్టనున్న నాలుగో విడుత పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వామ్యం కావాలని మేయర్ సభ్యులను కోరారు. 15 రోజుల పాటు సాగే పట్టణ ప్రగతి ప్రణాళికను వివరించారు. అనంతరం డివిజన్లోని శ్మశాన వాటికల అభివృద్ధిపై సభ్యులు చర్చించారు. శ్మశాన వాటికలకు ప్రహరీ, బర్నింగ్ ప్లాట్ఫాంలు నిర్మించాలన్నారు. దీనిపై మేయర్ గుండు సుధారాణి స్పందిస్తూ లీకేజీలు యుద్ధప్రాతిపదిక మరమ్మతుల చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తామని ఆమె తెలిపారు.
కౌన్సిల్ సమావేశం ముందుకు వచ్చిన ఎజెండా అంశాలకు సభ్యులు ఏకగ్రీంగా ఆమోదం తెలిపారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో మంజూరు అయిన బస్తీ దవాఖానాల ఏర్పాటు అంశానికి సభ్యులు అమోదం తెలిపారు. స్మార్ట్సిటీ పథకంలో భాగంగా నర్చరింగ్ నైబర్ హుడ్ సెల్ ఏర్పాటు, పట్టణ ప్రగతి కార్యక్రమాలు, హరితహరం-2022 అంశాలకు కౌన్సిల్ అమోదం తెలిపింది. అయితే సప్లమెంటరీ అంశంగా కౌన్సిల్ ముందుకు తీసుకవచ్చిన శ్మశాన వాటికకు పట్టా భూమి కేటాయించిన వారికి దాని విలువకు సమానంగా ప్రభుత్వ భూమి కేటాయిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించే అంశంపై ఇండిపెండెంట్, కాంగ్రెస్ కార్పొరేటర్లు వ్యతిరేకించారు. అయితే అధికార పార్టీ కార్పొరేటర్లు ఏకగీవ్రంగా అమో దం తెలపడంతో దానికి కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నగరాభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఇప్పటికే నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అదేశాలతో నగరాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతు న్నాం. ఏడాది కాలంలో నగరంలో రూ.396 కోట్లతో 933 అభివృద్ధి పనులు చేపట్టాం. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నేరవేర్చాలి.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో డివిజన్లోని సమస్యలు పరిష్కరించుకునేందుకు మంచి అవకాశం. అత్యవసర సమస్యలను గుర్తించి వెం టనే పరిష్కరించాలి. విలీన గ్రామాల డివిజన్లో 50 మం ది పారిశుధ్య కార్మికులను నియమించాలి.
జూన్ 3 నుంచి చేపట్టనున్న పట్ణణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. డివిజన్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న సమస్యలను పట్టణ ప్రగతిలో గుర్తించాలని సీఎం కేసీఆర్ సూచించారు. కార్పొరేటర్లు పట్టణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలి. పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక అధికారులను నియమించాం. పట్టణ ప్రగతిలో వచ్చిన ఫిర్యాదును వెంటనే యాప్లో నమోదు చేసి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం.