స్టేషన్ ఘన్పూర్, మే 12: రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద దళితులు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో యజమానులయ్యారు. ట్రాక్టర్లు, కార్లు, ట్రాలీలు.. ఇలా రూ. 2. 80 కోట్ల విలు వైన యూనిట్లు అందుకొని సంబురపడ్డారు. ఇన్నాళ్లు కూలీలుగా పనిచేసిన తమను సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంతో ఓనర్లను చేసి జీవితాల్లో కొత్త వెలుగు నింపారంటూ ఆనందం వ్యక్తం చేశారు. గురు వారం స్టేషన్ఘన్పూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్టేషన్ఘన్పూర్, చిల్పూర్, రఘునా థపల్లి, లింగాలఘనపూర్ మండలాల్లోని 28 మంది లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగగా, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి చేతులమీదుగా అందుకొని ఆయా కుటుంబాలు సంతోషం వ్యక్తంచేశాయి. స్టేషన్ఘన్పూర్ మండలంలో 8 మందికి, చిల్పూర్లో 5, రఘునాథపల్లిలో 8, లింగాలఘన్పూర్లో ఏడుగురికి యూనిట్లను పంపిణీ చేశారు. తమ జీవితంలో పది లక్షల ఆస్తికి ఓనర్లుగా మారుతామని కలలో కూడా అనుకోలేదని, ఇదంతా కేసీఆర్ దయ వల్లే కలిగిందని లబ్ధిదారులు మురిసిపోయారు.
కేసీఆర్ సాహసోపేత నిర్ణయం..
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ సంపత్రెడ్డి
దళితులను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుని దళిత బంధు ప్రవేశపెట్టారని, ఈ పథకాన్ని అమలు చేస్తుంటే కేంద్రప్రభుత్వానికి వణుకు పుడుతోందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండరాజయ్య, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి అన్నారు. దళిత బంధు పథకం రామబాణం లాంటిదని, దీన్ని ఎదుర్కోవడం బీజేపీ ప్రభుత్వం వల్ల కావడం లేదన్నారు. ఈ పథకాన్ని దేశమంతా అమలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురానుందన్నారు. దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని మీతోపాటు పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగాని లబ్ధిదారులకు సూచించారు. కొంచెం ఆలస్యమైనా నియోజకవర్గంలోని ప్రతి దళితుడికి అందిస్తామని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద లాభం పొందిన ప్రతి ఒక్కరూ విశ్వాసంగా ఉండాలని, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కోర్నేలియస్, డీఆర్డీవో రాంరెడ్డి, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, ఎంపీడీవో కుమారస్వామి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తాటికొండ సురేశ్, ఎంపీటీసీ గన్ను నర్సింహులు, స్టేషన్ఘన్పూర్ ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, చిల్పూర్ దేవస్థాన చైర్మన్ శ్రీధర్ రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామశాఖ అధ్యక్షు లు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, లబ్ధిదారుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
కేసీఆర్ వాహనమని గర్వంగ చెప్పుకుంట..
మాది రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామం. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. సీఎం కేసీఆర్కు మాలాంటి పేదల కష్ట సుఖాలు తెలుసు. మమ్మల్ని ఆదుకునేందుకే దళితబంధు పథకం తీసుకొచ్చిండు. మొదటి లిస్ట్లోనే ట్రాలీ తీసుకున్న. ఎక్కువ సమయం పనిచేసి ఆర్థికంగా ఎదుగుతాం. ఇంకో పదిమందికి ఉపాధి చూపిస్త. ఇది సీఎం కేసీఆర్ ఇచ్చిన వాహనం అని గర్వంగ చెప్పుకుంట.
– గుండె కుమార్ (జోసఫ్) కంచనపల్లి, రఘునాథపల్లి మండలం
జీవితంపై నమ్మకం కుదిరింది..
మాది చిల్పూర్ గ్రామం. నా భర్త మేస్త్రీ పని చేస్తుండు. నేను కూలి పనులకు పోత. ఇద్దరం పనిచేస్తే కుటుంబం గడుస్తున్నది. కేసీఆర్ సారు తీసుకొచ్చిన దళితబంధు పథకంతో జీవితంపై నమ్మకం కుదిరింది. నా భర్త చేసే పనికి కలిసి వస్తుందని ట్రాక్టర్ తీసుకున్నం. మా లాంటి పేదలను ఆదుకుంటున్న దేవుడులాంటి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటం.
– నలిమెల రజిత, చిల్పూర్
డోజర్ తీసుకున్న..
మాది నిరుపేద కుటుంబం. ఎలాంటి ఆస్తులు లేవు. సీఎం కేసీఆర్ మాలాంటి పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు చాలా తపన పడుతున్నరు. దళితబంధు పథకంతో మాకూ సమాజంలో గుర్తింపు వస్తది. డోజర్ తీసుకున్న. గ్రామంలో చాలా మంది పరిచయం ఉన్నరు.. ఎక్కువగా పనులు దొరికే అవకాశం ఉంది.. డోజర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంట.
– మారపెళ్లి ప్రసాద్బాబు, స్టేషన్ఘన్పూర్
కారుకు ఓనరునయ్యా..
మాది నిరుపేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. 2005 నుంచి కారు డ్రైవర్గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చి మాలాంటి నిరుపేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపిండు. డ్రైవర్గా పనిచేసే నేను కారుకు ఓనరునవుతానని కలలో కూడా అనుకొలె. ఇప్పుడు నాకు జీవితంపై భరోసా వచ్చింది. నా ఇద్దరు కూతుళ్లను మంచిగ చదివించుకుంట. – తాటికొండ రమేశ్, స్టేషన్ఘన్పూర్
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం
నాకు ఇద్దరు కూతుర్లు. ప్రైవేటు పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. దళితబంధు నా కుటుంబానికి ఆధారమైంది. డోజర్ తీసుకున్న. రూ. పది లక్షల విలువైన వాహనాన్ని కూలి పనులు చేసుకుంటూ కొనడం నా వల్ల అయ్యేది కాదు. రాత్రి పగలు కష్టపడి పని చేసి వృద్ధిలోకి వస్త. నా ఇద్దరు బిడ్డలను మంచిగ చదివించుకుంట. మేము బాగు పడేందుకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– గుర్రపు నర్సింహ, విశ్వనాథపురం, స్టేషన్ఘన్పూర్
దళితబంధుతో ధైర్యం వచ్చింది
నేను చదువుకున్న రోజుల్లో ఫుట్బాల్ ప్లేయర్ను. ఎన్నో మెడల్స్ సాధించా. అయినా ఎలాంటి ఉద్యోగం రాలేదు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్న. మాలాంటి పేదలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకం పెట్టి మంచి ఆలోచన చేసిండు. డోజర్ తీసుకున్న. కుటుంబాన్ని పోషించుకునే ధైర్యం వచ్చింది. ఈ పథకం రాకపోతే బతుకు దెరువు కోసం కుటుంబంతో సహా హైదరాబాద్కు పోయెటోన్ని.
– గుండె మల్లేశ్, స్టేషన్ఘన్పూర్