గిర్మాజీపేట, ఏప్రిల్ 22 : అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అసలైన దివ్యాంగులను గుర్తించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం వరంగల్ చౌరస్తాలోని మహేశ్వరి గార్డెన్లో మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, భారతీయ కృత్రిమ అవయవ తయారీ సంస్థ(అలిమ్కో) కాన్పూర్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన దివ్యాంగుల గుర్తింపు శిబిరాన్ని కలెక్టర్ గోపితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఏడేండ్లుగా తూర్పు నియోజకవర్గంలో దివ్యాంగుల క్యాంపులు నిర్వహించలేదని, మంత్రి కొప్పుల ఈశ్వర్తో మాట్లాడి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. అధికారులు పక్కాగా దివ్యాంగుల పర్సంటేజీని నమోదు చేయాలని, ఎలాంటి పైరవీలకు తలొగ్గద్దని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా దివ్యాంగులను గుర్తించాలన్నారు. దివ్యాంగుల పిల్లల లిస్టును డీఈవో ద్వారా తీసుకొని వారికి స్కాలర్షిప్లు వచ్చేలా చూడాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ.. జిల్లాలోని దివ్యాంగులు తమ పేర్లను ఎన్రోల్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి శారదకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కోట శ్రీవత్స, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్ గందె కల్పనానవీన్ తదితరులు పాల్గొన్నారు.
కరీమాబాద్లో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవనం ఎదుట గౌతమబుద్ధుడు, బీఆర్ అంబేద్కర్, దళిత రత్న బొమ్మల కట్టయ్య విగ్రహాల ఏర్పాటుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని హామీనిచ్చారు. శుక్రవారం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను క్యాంప్ కార్యాలయంలో కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ బొమ్మల అంబేద్కర్, సలహాదారులు కడారి కుమార్, ఎరుకల మహేందర్, కో కన్వీనర్ జక్కుల రాజు, తరాల సందీప్, తరాల రాజమణి, రామ్ప్రసాద్, రవితేజ, నరేందర్, గాలి రాజు, ఒంటెల సురేశ్, జక్కుల భాస్కర్, సారయ్య, కళావతి తదితరులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ : ఓరుగల్లు నగరం మతసామరస్యానికి నిదర్శనంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. రంజాన్ మా సం సందర్భంగా మసీదు మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా అధ్యక్షతన ఎల్బీనగర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనారిటీలు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్ ఎండీ పుర్ఖాన్, కమిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అలీ హిమాయత్, ఉపాధ్యక్షులు సర్వర్ పాషా, ముక్తార్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ ఆరిఫ్, ట్రెజరర్ అహ్మదుల్లా ఖాన్, సభ్యులు సయ్యద్ అహ్మద్, అఫ్జల్, కైసర్, తహసీన్, నజీర్ అఖిల్ పాల్గొన్నారు.