గీసుగొండ, 29: సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల ప్రాథమిక సహకార సంఘానికి రూ.50 లక్షల 36 వేల నాబార్డు నిధులు మంజూరు కాగా, 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి మొగిలిచెర్ల సొసైటీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే చల్లా మాట్లాడారు. గ్రేటర్ పరిధిలోని గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్నాయని తెలిపారు. మొగిలిచెర్ల చుట్టుపక్కల గ్రామాల మీదుగా ఔటర్రింగ్ రోడ్డు వెళ్తున్నదని, ఈ ప్రాంతాన్ని గ్రోత్ కారిడార్గా ప్రభుత్వం అభివృద్ధి చేయనుందన్నారు. భూములకు ధరలు పెరుగటంతో ల్యాండ్ పూలింగ్తో రైతులకు న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్ను కోరినట్లు వెల్లడించారు. మున్సిపల్ గ్రామాల్లో సాదాబైనామాలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మొగిలిచెర్ల ప్రాంతంలో ప్రభుత్వ భూమి కేటాయిస్తే కోల్డ్స్టోరేజీ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. కోల్డ్స్టోరేజీ నిర్మాణం ద్వారా సహకార సంఘం ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఇప్పటికే డీసీసీబీ ద్వారా సహకార సంఘంలోని 263 మంది రైతులకు రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. 40 మందికి జేఎల్జీ రుణాన్ని ఇచ్చామని తెలిపారు. సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సొసైటీల ద్వారా మక్కజొన్నలు, వడ్లను కొనుగోలు చేస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తున్ని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల మనోహర్, గద్దె బాబు, డీసీసీబీ సీఈవో చిన్నరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సొసైటీ వైస్ చైర్మన్ కందుల శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, ఏవో హరిప్రసాద్బాబు, ఏఈవో హుస్సేన్, నాయకులు వేంకటేశ్వర్లు, ఉజ్వల్, ముక్కెర సతీశ్, డైరెక్టర్లు కిషన్, రాజు, స్వామి, కల్పన, శ్రీనివాస్, కట్టస్వామి, రమేశ్, సునీల్, అశోక్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.