స్టేషన్ ఘన్పూర్/పాలకుర్తి రూరల్, మార్చి 24 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనేదాకా కొట్లాడుతామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో గురువారం నిర్వహించిన ధాన్యం కొనుగోళ్ల పోరు సన్నాహక సమావేశం, స్టేషన్ఘన్పూర్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ వడ్ల కొనుగోళ్లపై ఢిల్లీలోనే తేల్చుకుంటామన్నారు. ధాన్యాన్ని పార్లమెంట్ ముందు పోసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించకుంటే కేంద్రం సంగతి తేల్చుకుంటామన్నారు. పంజా బ్, హర్యానాలో రెండు పంటల ధాన్యాన్ని కోనుగోలు చేస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణపై ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు బండి సంజయ్, కిషన్రెడ్డిని రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ నాయకులు ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో మోదీ ఆటలు సాగవన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు డ్రామా లు ఆడుతున్నారని మండిపడ్డారు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీని ఇచ్చేదాకా కేంద్రంపై పోరాడుతామని స్పష్టం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా గ్రామ, మండ ల, జిల్లాల వారీగా తీర్మానాలు చేసి పంపాలని సూచించా రు. ప్రతి రైతు ఇంటిపై కేంద్రానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ధాన్యం కోసం చేస్తున్న పోరాటంలో ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలతో శవయాత్రలు తీయాలని, సర్పంచ్లు, ఎంపీటీసీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, పాలన చూసి బీజేపీ నాయకులు భయపడుతున్నారన్నారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుబంధువు అని కొనియాడారు. కేంద్రంపై రైతులు కదం తొక్కాలని జనగామ జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి పిలుపునిచ్చారు. సభలో గిద్దె రాంనర్సయ్య, జనగామ శంకర్ పాటలు సభికులను ఉత్తేజ పరిచాయి. కేంద్రంపై పోరాటానికి సభలో పలు తీర్మానాలు చేశారు. సమావేశాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, వరంగల్ మార్కెట్ వైస్ చైర్మన్ కరంచంద్, స్టేషన్ఘన్పూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, కాకిరాల హరి ప్రసాద్రావు, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, బస్వ సావిత్రి, జ్యోతి, జినుగు అనిమిరెడ్డి, తూర్పాటి చిన్న అంజయ్య, ఈదూరు ఐలయ్య, జడ్పీటీసీలు కేలోతు సత్తమ్మ, పల్లా భార్గవి, రంగు కుమార్, డాక్టర్ సోమేశ్వర్రావు, కేతిరెడ్డి సోమనర్సింహారెడ్డి, లింగాల వెంకటనారాయణ గౌడ్, రాంచంద్రయ్య శర్మ, పార్టీ పాలకుర్తి మండలాధ్యక్షుడు పసునూరి నవీన్, తీగల దయాకర్, వసుమర్తి సీతారాములు, సిందె రామోజీ, మునావత్ నర్సింహా నాయక్, ఆకుల సురేందర్రావు, బిల్లా సుధీర్రెడ్డి, వీరమనేని యాకాంతారావు, మేడారపు సుధాకర్, వర్రె వెంకన్న, వీరారెడ్డి దామోదర్రెడ్డి, ముస్కు రాంబాబు, ఎండీ మదార్, మంగళంపల్లి రాంచంద్రయ్య, అనుమాండ్ల దేవేందర్రెడ్డి, జినుగు సురేందర్రెడ్డి, ఈదూనూరి నర్సింహారెడ్డి, మాచర్ల ఎల్లయ్య, వంగ అర్జున్, చామల విక్రంరెడ్డి, ఇట్టే శ్యాంసుందర్రెడ్డి పాల్గొన్నారు.