కాశీబుగ్గ, ఫిబ్రవరి 17 : నగరంలోని 18వ డివిజన్ ఓ సిటిలోని ఆంజనేయస్వా మి దేవాలయం వద్ద సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే పటాకులు కాల్చారు. హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్ అంటూ లైటింగ్ ఏర్పాటు చేశారు. 68 కిలోల కేక్ను ఎమ్మెల్యే కట్ చేశారు. అలాగే కేసీఆర్పై అభిమానంతో ఎమ్మెల్యే స్వయంగా రాసిన ‘దేశ్ కి నేత కేసీఆర్’ అనే పాటను లాంచ్ చేశారు. అనంతరం మేడారం జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. గురువారం మహా మృత్యుంజయ సహిత హోమాన్ని నరేందర్, వాణి దంపతులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తె లంగాణ సాధించింది.. అభివృద్ధి చేస్తున్నది కేసీఆరే అని అన్నారు. రాష్ట్రం కోసం తన ప్రాణాలనే ఫణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అన్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నా యకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. డి ప్యూటీ మేయర్ రిజ్వానా సుల్తానా, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, వస్కుల బాబు, బాల్నే సురేశ్, దిడ్డి కుమారస్వామి, కావటి కవిత, సురేశ్జోషి, ఫుర్కాన్, భోగి సువర్ణ, ముష్కమల్ల అరుణ, సోమిశెట్టి ప్రవీ ణ్, బస్వరాజ్ శిరీష, మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, కే రాజేందర్ పాల్గొన్నారు.