వరంగల్, డిసెంబర్ 21: నిత్యం ప్రజల మధ్య ఉంటున్న ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు దేవరకొండ సురేందర్ డిమాండ్ చేశారు. 11వ డివిజన్ బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ 29వ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్ ఇంటిపై దాడి చేసిన బీజేపీ నేతలపై మాత్రమే కేసులు పెట్టామన్నారు.
బీజేపీ నాయకులు కావాలనే బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దాస్యం నాయకత్వంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని తెలిపారు. దాస్యంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కొడకండ్ల సదాంత్, మహ్మద్ షఫీ అహ్మద్, కందుల సృజన్కాంత్, సుభద్ర, అయేషా ఫాతిమా, విద్య, మెడకట్ల సుకుమార్, భీమ్రాజ్, విజయబాబు, హరీశ్, అబ్బు, జావీద్, ఇర్ఫాన్, రమేశ్ పాల్గొన్నారు.