నెక్కొండ, డిసెంబర్ 21: నిత్య జీవితంలో, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గణిత పరిజ్ఞానం అత్యంత అవసరమని నెక్కొండ ఎంపీపీ జాటోత్ రమేశ్, ఎంఈవో రత్నమాల, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బండారి రమేశ్ అన్నారు. నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని గణిత కృత్యమేళాను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లిష్టమైన గణిత సమస్యలను సులభంగా అర్థం చేసుకునేందుకు సహాయపడే వంద గణిత కృత్యాలను విద్యార్థులు ప్రదర్శించారు.
గణిత ఉపాధ్యాయులు బండారి రమేశ్, మిర్ ఇక్బాల్ఖాన్, ఎన్ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ పదో తరగతిలో విద్యార్థులు చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి 10/10 గ్రేడ్ సాధించాలని కోరారు. గణిత కృత్యమేళాను మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సొంటిరెడ్డి యమునా రంజిత్రెడ్డి, హెచ్ఎం రంగారావు, మండల ప్రత్యేక అధికారి ఉషారాణి, ఉప సర్పంచ్ వీరభద్రయ్య పాల్గొన్నారు.
గణిత నమూనాల ప్రదర్శన
పర్వతగిరి/రాయపర్తి: పర్వతగిరి మండలం చింతనెక్కొండలోని విజ్ఞాన భారతి విద్యాలయంలో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు గణిత నమూనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ అక్కినపెల్లి సతీశ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే గణితంపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం పిల్లలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు గొర్ల సరిత, ఆకారం సరిత, శిరీష, పద్మావతి పాల్గొన్నారు.
రాయపర్తి జిల్లా పరిషత్ సెకండరీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం అజ్మీరా ఉమాదేవి నేతృత్వంలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణితశాస్త్ర ప్రాధాన్యాన్ని తెలియజేసేలా చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టీచర్లు రావుల భాస్కర్రావు, శివపురం వీరభద్రశర్మ, గుగులోత్ సునీత, మారం రోజారాణి, గాండ్ల మమత, నవమణి, పోలెపాక స్వర్ణ, సీఆర్పీ దేవేందర్, కోల ప్రభాకర్, శోభారాణి, ఉమారాణి పాల్గొన్నారు.