మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 17 : నిరుపేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. క్రిస్మస్ పండుగ కోసం క్రైస్తవులకు ప్రభుత్వం అందజేసిన గిఫ్ట్ప్యాక్ల శనివారం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి ఆమె పంపిణ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలకులు మైనార్టీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని, ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతి నిరుపేదకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని, బతుకమ్మ పండుగలకు మహిళలకు చీరెలు, ముస్లింలకు రంజాన్ కానులు, క్రైస్తవులకు గిఫ్ట్ప్యాక్ అందజేసి వారి ఇళ్లలో ఆనందం నింపుతున్నారని అన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో విద్య, ఉద్యోగ రంగాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మత పిచ్చి ఉన్న బీజేపీ నాయకుల మాటలను నమ్మొద్దని, గ్రామాల్లోకి వస్తున్న ఆ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ.. దళితబంధు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతులు పండించిన అన్ని పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్పై చెడుగా ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఒక సైనికుల్లా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, తహసీల్దార్ నాగభవాని, ఎంపీపీ భూక్యా మౌనిక, జడ్పీటీసీ ప్రియాంక, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్ పాషా, మార్నేని వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుధగాని మురళి, వార్డ్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నిరు పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరమని ఎంపీ కవిత అన్నారు. శనివారం పట్టణంలోని ఎంపీ క్యాంపు ఆఫీస్లో 70మంది లబ్ధిదారులకు 36.62లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పర్కా ల శ్రీనివాస్రెడ్డి, కేసన్రెడ్డి, ముత్యం వెంకన్న, జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా, పృథ్వీరాజ్, హరిసింగ్, రావిశ్, ప్రవీణ్, శ్రీనివాస్, లక్ష్మణ్ పాల్గొన్నారు. కాగా, త్వరలో జిల్లాకు సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు.