సంగెం, డిసెంబర్ 11 : మహిళా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఆశాలపల్లి గ్రామంలో రూ. 20లక్షలతో వేసిన సీసీ రోడ్డును ఆదివారం ప్రారంభించారు. రూ. 20లక్షలతో చేపట్టనున్న మహిళా భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. తల్లీబిడ్డల సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టారన్నారు. స్త్రీనిధితో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నారని తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందాయని చెప్పారు.
నియోజకవర్గంలోని 150 గ్రామాలకు 3వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు సీఎం కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ఆశాలపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిచేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పా రు. గ్రామంలో 325 మందికి పింఛన్లు వస్తున్నాయని, మరో 12 మందికి త్వరలోనే ఇప్పిస్తానన్నారు. రూ. 20లక్షలతో సీసీ రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. గ్రా మానికి చెందిన బొల్లెబోయిన మల్లికార్జున్ తన తండ్రి, తాత జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీకి విరాళంగా అందజేసిన స్వర్గరథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
అలాగే, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు రూ. 7లక్షల50వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. గుంటూరుపల్లి గ్రామంలో అయ్యప్ప మహా పడిపూజలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సర్పంచ్ బొల్లెబోయిన కిశోర్యాదవ్, ఎంపీటీసీ చిదురాల రజిత, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, మండలాధ్యక్షుడు పసునూరి సారంగపాణి, ఇన్చార్జి తహసీల్దార్ రాజేశ్వర్రావు, పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ రమేశ్, గ్రామ అధ్యక్షుడు రాంగోపాల్రావు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గుండేటి బాబు, పూజారి గోవర్ధన్ గౌడ్, నర్సింహస్వామి, పెంతల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం..
గీసుగొండ : సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15,16వ డివిజన్కు చెందిన 35 మందికి రూ. 11 లక్షల 22 వేల విలువైన చెక్కులను ఆదివారం హనుమకొండలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు బంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, పెన్షన్, సీఎంఆర్ఎఫ్ తదితర పథకాలను నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో కూడా లేవన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, నాయకుడు శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.