పోచమ్మమైదాన్, డిసెంబర్ 5: వరంగల్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పుట్టిన రోజు వేడుకలను పోచమ్మమైదాన్ సెంటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ సార య్య కుమారుడు బస్వరాజు శ్రీమాన్ చేతుల మీదుగా కేక్కట్ చేసి, మహా అన్నదానం చేశారు. ముందుగా కాశీబుగ్గ నుంచి పోచమ్మమైదాన్ సెంటర్ వరకు బైక్, ట్రాక్టర్ ర్యాలీ ని నిర్వహించారు. 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, పార్టీ నాయకులు కొరివి పరమేశ్వర్, బస్వరాజు రాజు, చాగంటి శ్రీనివాస్, జన్ను శ్యాం, రాజేశ్, బండ్ల సురేందర్, శివ, శ్రీకాంత్, బిల్లా రమేశ్, సుశీల్ గౌడ్, గుమ్మడి శ్యాం, జనున కరుణాకర్ పాల్గొన్నారు.
అంధుల పాఠశాలలో పండ్ల పంపిణీ..
తెలంగాణ జాగృతి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి మడిపల్లి సుశీల్ గౌడ్ ఆధ్వర్యాన ఆటోనగర్లోని లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్స్, పండ్లను పంపిణీ చేశారు. నాయకులు బస్వరాజు శ్రీమాన్, శ్రీనివాస్, శ్యా మ్, మహేశ్ కుమార్, నిహార్, కిశోర్ పాల్గొన్నారు. అలాగే శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ముద్దసాని మల్లిక, ప్రధాన కార్యదర్శి నన్నపునేని సంజీవరావు, ఉపాధ్యక్షుడు ఎన్ జనార్దన్, కోశాధికారి కే కళ, కార్యదర్శులు శారద, సరోజన, రాజేందర్ పాల్గొన్నారు.
కరీమాబాద్లో..
కరీమాబాద్: ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్య క్షుడు ఎండీ సాధిక్ ఆధ్వర్యంలో వరంగల్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఉర్సులోని కమాల్పాషా ఘడీలో సోమవారం కేక్కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ రబ్బా నీ పాషాఖాద్రీ, యా కూబ్పాషా, రషీద్, అబుఖాన్, బాల కొమురెల్లి , ఖాజా పాషా, రబ్బాని పాల్గొన్నారు.