వర్ధన్నపేట, నవంబర్ 30: రాష్ట్రంలోని పేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లోని 74 మంది వృద్ధులు, దివ్యాంగులకు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం వీల్చైర్లు, వినికిడి యంత్రాలు, కళ్లద్దాలు, చేతికర్రలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా వృద్ధులకు రూ. 2 వేలు, దివ్యాంగులకు రూ. 3 వేల ఆసరా పింఛన్ అందిస్తున్నదని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ, జాబ్మేళా నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, సీడీపీవో శ్రీదేవి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
పర్వతగిరి: మండలంలోని బూరుగుమళ్ల గ్రామానికి చెందిన వేల్పుల కొమురయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. అతడి కుటుంబానికి మంజూరైన రూ. 1.25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేశ్ అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి కుమారుడు సాయికిరణ్కు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితెందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.