గిర్మాజీపేట, నవంబర్ 26 : కలెక్టర్ గోపి పెరికవాడలోని రైల్వేగేట్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారాడు. నాలుగో తరగతి విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను పరిశీలించారు. ‘చిన్నారి కల’ అనే తెలుగు పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలను విద్యార్థులను అడిగారు. అలాగే, పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించారు. ఓటరు నమోదు, మార్పులు చేర్పులను పక్కాగా చేయాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటరు వివరాలను ‘గరుడ’ యాప్లో ఎలా నమోదు చేస్తున్నారని సిబ్బంది ఆరాతీశారు. కలెక్టర్ వెంట హెచ్ఎం నర్సింహులు, ఉపాధ్యాయులు జీ రాజేశ్, పీ సుకన్య, ఏ గణేశ్, పోలింగ్స్టేషన్ 102, 103, 104, 113 బీఎల్వోలు బీ సుజాత, కే భాగ్యలక్ష్మి, వీ జ్యోత్స్న, శారద పాల్గొన్నారు.