తొర్రూరు, నవంబర్ 26 : నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ పథకాలు వారికి పకడ్బందీగా అందే లా కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్భగీరథ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ నేతలకు సూచించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల టీఆర్ఎస్ పార్టీ బాధ్యులు, యువజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, కా ర్మిక, రైతు, సోషల్ మీడియా, ఇతర సంఘాల నాయకులతో శనివారం పర్వతగిరిలోని మంత్రి నివాసంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు పార్టీ ప్రజా ప్రతినిధులు, బాధ్యులు, ము ఖ్యులంతా నిత్యం నియోజకవర్గంలోని ప్రజలకు అం దుబాటులో ఉంటూ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను చేరవేయాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు వారికి వివరించాలన్నారు.
బూత్ కమిటీలను బలోపే తం చేయడంలో భాగంగా 150 మందికి ముగ్గురు చొ ప్పున ఇన్చార్జిలను నియమించాలని, అందులో ఒక రు పార్టీ కార్యకర్త, మహిళ, యువజన విభాగం నుంచి ప్రతినిధులు ఉండాలని చెప్పారు. వచ్చే నెల 5వ తేదీ నాటికి బూత్ కమిటీల బాధ్యుల నియామకం పూర్తి కావాలన్నారు. మండలాల వారీగా బూత్ కమిటీ కో-ఆర్డినేటర్లను నియమించారు. బూత్ కమిటీల్లో సర్పం చ్, ఎంపీటీసీ, గ్రామ కమిటీ ప్రతినిధులను నియమించొద్దని, కేవలం సీనియర్ నాయకులు, మాజీ సర్పం చ్, మాజీ ఎంపీటీసీలు ఉండేలా చూసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో పార్టీ నిర్మాణం దృఢంగా ఉండేలా పార్టీలోని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాల వారీగా ప్రభుత్వ పథకా లు పొందుతున్న లబ్ధిదారుల జాబితాను రూ పొందించుకోవాలన్నారు.
ప్రభుత్వ పథకాల జాబితా గ్రామ బా ధ్యుల వద్ద ఉండాలని, అవసరమైతే కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రేణులంతా పని చేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు. త్వరలో ఎంపీటీసీల పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో మహబూబాబాద్లో సీఎం కేసీఆర్ పర్యటన ఉండే అవకాశం ఉందని, పాలకుర్తి నియోజకవర్గం నుంచి సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పారు. డబుల్ బెడ్రూం గృహాలు, రైతుబంధు, దళిత బంధు, పింఛన్ల వంటి పెండింగ్ జా బితాలు రూపొందించి, అర్హులకు న్యాయం చేయాలన్నారు. కుల సంఘాల భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు నిర్మిస్తామని, తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం, ఒకో ఇంటికి ఈ ప్రభుత్వంలో జరిగిన లబ్ధి ని వివరించడం, పెండింగ్ అంశాలు, పనులను గుర్తిం చి వాటిని పూర్తి చేసేవిధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీని పటిష్టం చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరించాలని మంత్రి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.