హనుమకొండ, నవంబర్21: రైతులు వ్యవసా య ఉత్పత్తులు తీసుకువచ్చే ప్రతి గన్నీ బ్యాగుకు సంబంధిత కరీదు వ్యాపారి రూ.30 చెల్లించేందు కు వ్యాపారులు అంగీకరించారని రాష్ట్ర పంచాయ తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం హనుమకొండలోని ఆర్ అండ్బీ గెస్ట్హౌస్లో మంత్రి రైతు సంఘాల నా యకులు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి నిధులు, మారెటింగ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ నేటి నుంచి వరంగల్ ఎనుమాముల మార్కెట్ను ప్రారంభించేందుకు వ్యాపారస్తులు అంగీకరించా రని అన్నారు. రైతులు కూడా వీలైనంత వరకు మంచి బ్యాగులు వినియోగించాలని కోరారు. మిగతా మార్కెట్లలో గన్నీ బ్యాగుల నాణ్యత, ధర పై అధ్యయనం చేసేందుకు రైతులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, అధికారులు ఇద్దరు చొప్పు న కమిటీ వేస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 26వ తేదీ లోపు నివేదిక ఇస్తుందని, వెంటనే మరోసారి సమావేశం పెట్టి దీనికి శాశ్వత పరిష్కారం చూపి స్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు ఎలాం టి నష్టం రాకుండా చూడాలని, అందుకు వ్యాపా రులు సహకరించాల న్నారు. నాణ్యతలో రాజీ వద్దని, మంచి గన్నీ సంచులనే తీసుకురావాలని సూచించారు. రైతాంగం విషయంలో మన ప్రభు త్వం చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా చేయడం లేదన్నారు. అతుకుల గోనె సంచులకు రూ. 30 తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. నాణ్య త లేకుండా చినిగిన గన్నీ సంచులు వస్తే రిజెక్ట్ చే యాలని చెప్పారు.
పూర్తిగా చెడిపోయిన గోనె సంచులు, యూరియా బస్తాలను కూడా రిజెక్టు చేస్తే అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుం టా రని తెలిపారు. సౌండ్ గన్నీ విషయంలో కొంత మార్పులు చేస్తూ రేపే కొత్తగా తాత్కాలిక ఆర్డర్ కలెక్టర్ ఇస్తారని తెలిపారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ గోపి మాట్లాడుతూ సౌండ్ గన్నీ బ్యాగ్కు రూ.30 ఇవ్వాలనేది 2017 నుంచి అమలులో ఉందని, కొత్తగా వచ్చింది కాదని అ న్నారు. గన్నీ సంచులకు డబ్బులు ఇచ్చే విధానం ఇప్పుడున్నది కాదని, దానిపై అవగాహన కల్పి స్తామని అన్నారు. రెండోసారి ఉపయోగించే గన్నీ బ్యాగ్కు మాత్రమే డబ్బులు ఇవ్వమన్నారు.
మం డల అధికారులతో కౌంటర్స్ ఏర్పాటు చే యించి అవగాహన కల్పిస్తామని అన్నారు. వ్యా పారులు రైతుల పట్ల సానుకూలంగా ఉండాలని సూచిం చారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ రవికు మా ర్, అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్స, ఆర్డీఓ మ హేంద ర్జీ, జేడీఏ మల్లేశం, డీడీఎం రాజునాయ క్, డీఎంఓ పాలకుర్తి ప్రసాదరావు, మార్కెట్ కార్యదర్శి బరు పాటి వెంకటేష్ రాహుల్తో పాటు చాంబర్ ప్రతిని ధులు, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.