కరీమాబాద్/గిర్మాజీపేట, సెప్టెంబర్ 29: అండర్ రైల్వేగేట్ ప్రాంతం 32వ డివిజన్ ఎస్ఆర్ఆర్తోటలోని నాగదేవతా సహిత శ్రీకనకదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని లలితా త్రిపురసుందరిదేవిగా అలంకరించారు. పూజారి పాలకుర్తి ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. వరంగల్ రామన్నపేటలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం, స్టేషన్రోడ్డులోని శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయంలో హోమాలు, అభిషేకాలను అర్చకులు నాగేశ్వరశర్మ, వెంకటనర్సింహాశాస్త్రి, రత్నాకర్రావు, లంకా శివకుమార్శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.
శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిత్య చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు బ్రహ్మదేవర ఆనందరావు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి గన్ను రవికాంత్, కోశాధికారి తోట సోమేశ్వర్, ఉపాధ్యక్షులు పబ్బా సాంబమూర్తి, యాదా కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి పిన్నా ఈశ్వర్, టీ రాజేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. స్టేషన్రోడ్డులోని ఆకారపువారిగుడిలో గజగౌరి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. సాయంత్రం అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించినట్లు అర్చకుడు లంకా శివకుమార్శర్మ తెలిపారు.
లలిత పంచమి మహాలక్ష్మీమాత అలంకరణ..
కాశీబుగ్గ/నల్లబెల్లి: వరంగల్ 19వ డివిజన్ నర్సంపేటరోడ్డులోని శ్రీకనకదుర్గమాత ఆలయంలో 4వ రోజు లలిత పంచమి మహాలక్ష్మీమాత అలంకరణలో కనకదుర్గమాత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే, రూ. 30 వేల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ చేశారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతిపూజ, చంఢీహోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మీసాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. నల్లబెల్లి నారక్కపేటలో అమ్మవారిని లలితా త్రిపురసుందరిగా అలంకరించారు. ఈ సందర్భంగా దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బొడిగె కృష్ణవేణి, స్వర్ణలత, శ్రీపతి చిరంజీవి, శైలజ, కావటి కృష్ణంరాజు, స్వర్ణలత, వడ్లూరి రమేశ్, ఉష, వనపర్తి రాజు, భాగ్యలక్ష్మి, వైనాల అశోక్, కల్యాణి, దండం రాజేశ్, సహస్ర పాల్గొన్నారు.