మహబూబాబాద్ రూరల్, జూన్ 4: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యాలయంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మెగా జాబ్మేళాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నేటి ఆధునిక ప్రపంచంలో పోలీసులు శాంతి పరిరక్షణలోనే కాకుండా అనేక సమాజ సేవా కార్యక్రమాల్లో సైతం ముందు ఉంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని గ్రామాల్లో రక్ష ణ చర్యలు చేపడుతున్నారని, జిల్లాలో ఇలాంటి మేళాలను యువత వినియోగించుకోవాలన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న జిల్లా పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
మెగా జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొనగా, 1500 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంటర్వ్యూ నిర్వహించి 734 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఉద్యోగ అవకాశం రానివారు నిరుత్సాహపడొద్దని, ఇలాంటి జాబ్ మేళాలు జిల్లాలో మరిన్నో ఏర్పాటు చేస్తామని మంత్రి యువతకు హామీ ఇచ్చారు. ఇదే భవిష్యత్కు మొదటి మెట్టుగా భావించి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.
ప్రతి సంవత్సరం జిల్లా కేంద్రం జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన యువతకు కాల్ లెటర్స్ను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, డీఎస్పీ సదయ్య, హెచ్ఆర్ కో-ఆర్డినేటర్ భరత్, స్కూల్ డైరెక్టర్ సుధా, సీఐలు, ఎస్సైలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.