జిల్లాలో వజ్రోత్సవ సంబురం నెలకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జిల్లావాసులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మహబూబాబాద్ 24వ వార్డులో ఇంటింటికీ త్రివర్ణ పతాకాలను అందజేసే కార్యక్రమాన్ని కలెక్టర్ శశాంక ప్రారంభించారు. 10 థియేటర్లలో గాంధీ చిత్రం ప్రదర్శించగా, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు వీక్షించారు. పలు చోట్ల దేశభక్తిని చాటేలా కార్యక్రమాలు నిర్వహించారు. తొర్రూరులో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. గురువారం ఫ్రీడం రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొర్రూరు, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పిలుపునిచ్చారు. 15 రోజుల పాటు సంబురాలు ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జి ల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా మంగళవా రం గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి వెళ్లి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. థియేటర్లలో గాంధీ చిత్రా న్ని ప్రదర్శించారు. విద్యార్థులు చిత్రాన్ని తిలకించారు.
తొర్రూరు మున్సిపాలిటీలోని వార్డుల్లో జెండాల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, వైస్చైర్మన్ జినుగ సురేందర్రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ప్రతి వార్డుకు సుమారు 200 ఇళ్లకు జెండాలు పంపిణీ చేసేలా కౌన్సిలర్లతో కలిసి మెప్మా సిబ్బంది సహకారంతో ప్రణాళిక రూపొందించారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్లీడర్ ఏ శ్రీనివాసరావు, ఏఈ రంజిత్, కౌన్సిలర్లు జీ శంకర్, కే శంకర్, టీఆర్ఎస్ నాయకులు కే నాగరాజు, జీ నర్సయ్య, సీహెచ్ మణిరాజ్, టీ రవి, ఎన్ రాజు, టీ శ్రావణ్, ఆర్పీలు పాల్గొన్నారు. తొర్రూరులోని ఏషియన్ రామకృష్ణ థియేటర్లో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించారు. వివిధ పాఠశాలలకు చెందిన 280 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఆర్డీవో ఎల్ రమేశ్, డీఎస్పీ రఘు, తహసీల్దార్ వీ రాఘవరెడ్డి, ఎస్సై గండ్రాతి సతీశ్, సిబ్బంది చిత్రాన్ని వీక్షించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లోకి బస్సులు పంపించారు. థియేటర్ వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 11న ఉదయం 6 గంటలకు 2కే ఫ్రీడమ్ రన్, భారీ జాతీయజెండా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ వీ రాఘవరెడ్డి, ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రన్ను ప్రారంభిస్తారని, అంబేద్కర్ విగ్రహం నుంచి అమ్మాపురం రోడ్డులోని శక్తిస్థల్ వరకు ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, క్రీడాకారులు, అభిమానులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, తొర్రూరు పట్టణ, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ఆజాదీకా అమృ త్ మహోత్సవంలో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమా న్ని పురస్కరించుకొని పోస్టల్శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తొర్రూరు మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి పౌరుడు జాతీయ భావం, దేశ సమైక్యతను పెంపొందాలని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాక ఎగురవేయాలని పోస్టల్శాఖ ఇన్స్పెక్టర్ లావూరి సైదా సూచించారు.
కార్యక్రమంలో తొర్రూరు సబ్ పోస్ట్మాస్టర్ నాగమళ్ల కృష్ణమూర్తి, కే వినీశ్, నరేశ్, సుధీర్, మధు, సతీశ్, యాకయ్య, తెలంగాణ సామాజిక రచయితల సం ఘం జిల్లా అధ్యక్షుడు ఈ రాంబాబు, శాట్ అధ్యక్షుడు టీ కృష్ణారెడ్డి, శివ, సబ్డివిజన్ పరిధి పెద్దవంగర, వడ్డేకొత్తపల్లి, కొడకండ్ల, దంతాలపల్లి సబ్, బ్రాంచ్ పోస్ట్మాస్టర్లు పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్: మండల పరిధిలోని నడివాడ జీపీ సర్పంచ్ పెదగాని నర్మదగుట్టయ్య ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికీ వెళ్లి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాలను ఎగుర వేయాలని, స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీపాల్రెడ్డి, ఎం రఘు, టీ కృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్, సెక్రటరీ మోహన్ పాల్గొన్నారు.
మరిపెడ : మండలంలోని అబ్బాయిపాలెం, గాలివారిగూ డెం గ్రామాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఎంపీపీ జీ అరుణ, తహసీల్దార్ పీ రాంప్రసాద్, ఎంపీడీవో కే ధన్సింగ్, రైతుబంధు సమితి సభ్యులు జీ కాలునాయక్, ఎం స్రవంతిభద్రయ్య, పీ సూజాత, రేఖావెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
డోర్నకల్: మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాక ఎగురవేయాలని మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న అన్నారు. మంగళవారం 13వ వార్డులో ఆయన ఇంటింటికీ వెళ్లి జాతీయ జెండాను పంపిణీ చేసి మాట్లాడారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం జాతీయ జెండా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంత రం లక్ష్మి థియేటర్లో చిలుకోడు మోడల్ స్కూల్ 160 మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్ని తిలకించారు.
కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ కే శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ పోటు జనార్దన్, మున్సిపల్ మేనేజర్ ఉదయ్కుమార్, తహసీల్దార్ వివేక్, టీఆర్ఎస్ నాయకుడు గౌస్ పాల్గొన్నారు. అదేవిధంగా తెల్లబండ తండా జీపీ పరిధిలోని ఎర్రకుంట తండాలో ఎంపీపీ ధరంసోత్ బాలూనాయక్, జడ్పీటీసీ పొడిశెట్టి కమలారామనాథం జాతీయ జెండాను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఛత్రూ నాయక్, సర్పంచ్ జీ శ్రీనివాస్, ఎంపీడీవో అపర్ణ, తహసీల్దార్ వివేక్, ఎంపీవో ఎం మున్వర్ బేగ్, కార్యదర్శి కృష్ణ ప్రసాద్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు హనుమ, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
బయ్యారం: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని డీపీవో సాయిబాబా తెలిపారు. మండలంలోని జగ్గుతండాలో జాతీయ జెండాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, ఎంపీడీవో చలపతిరావు, ఎంపీవో రమణ, సెక్రటరీ శ్రీధర్ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని గ్రామాల్లో జీపీ సిబ్బంది జెండా పంపిణీ చేశారు. జగత్రావ్ పేటలో ఎంపీపీ మౌనిక, బయ్యారంలో సర్పంచ్ కోటమ్మ, కొత్తపేటలో వైస్ఎంపీపీ గణేశ్, సర్పంచ్ మమత పంపిణీ చేశారు.
గార్ల: మండల కేంద్రంలో ఇంటింటికీ జడ్పీటీసీ జాటోత్ ఝాన్సీలక్ష్మి జాతీయ జెండాను పంపిణీ చేసి మాట్లాడారు. 15 రోజులపాటు వేడుకలు గ్రామాలు, పట్టణాల్లో ఘనంగా నిర్వహించాన్నారు. మండలంలో 20 జీపీల్లో జెండాలు పంపిణీ చేశారు. సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్, తహసీల్దార్ రాము, ఎంపీడీవో రవీందర్, ఎస్సై బీ వెంకన్న, టీఆర్ఎస్ మండల అధ్య క్షుడు జీ లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.
కేసముద్రం: మండలంలోని అమినాపురం, ఇంటికన్నే గ్రామాల్లో జీపీ సిబ్బంది ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. రైతులు నారుమడిలో 75 అని రాసి జాతీయభావాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్, ఎంపీడీవో రోజారాణి, ఎస్సై రమేశ్బాబు, సర్పంచులు జీ సరిత, ఏ ప్రభాకర్, పీ రాజమణి, టీఆర్ఎస్ నాయకులు జీ వీరస్వామి, పీ రమేశ్, ఏ శ్రీనివాస్, యాకూబ్రెడ్డి, శంకర్నాయక్ పాల్గొన్నారు.
గంగారం: మండల కేంద్రంలో తహసీల్దార్ సూర్యనారాయణ,ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఇంటింటికీ వెళ్లి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. సర్పంచ్ జీ సుగుణ, సీహెచ్ సారక్క, కార్యదర్శులు స్వరూప, విఘ్నేశ్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
నర్సింహులపేట: మండల కేంద్రంతోపాటు, నర్సింహాపురం బంజర, పెద్దనాగారం గ్రామాల్లో సర్పంచులు రజితారెడ్డి, గుగులోత్ మాధురి, కలమ్మ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు అందజేశారు. కొమ్ములవంచలో 75 అక్షరాలను మొక్కలతో అలకరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శివ, సాత్విక్, శ్రీకాంత్, వినోద్కుమార్ ఉన్నారు.
పెద్దవంగర: మండలంలోని గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు ఇంటింటికీ జాతీయ జెండాను పంపిణీ చేశారు. పెద్దవంగరలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్యశర్మ, తహసీల్దార్ రమేశ్బాబు, ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. అలాగే తొర్రూరు డివిజన్ కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్లో గాంధీ చిత్ర ప్రదర్శనకు కేజీబీవీ పాఠశాల విద్యార్థులను తరలించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కేజీబీవీ ఎస్ వో స్రవంతి, ఇన్చార్జి ఎంపీవో జగధీష్, ఇఇన్చార్జి ఈసీ సురేశ్, టీఆర్ఎస్ నాయకులు లింగమూర్తి, హరీశ్,పరమేశ్, సోమేశ్వర్, జీపీ కార్యదర్శులు, ఆశ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
చిన్నగూడూరు: మండలంలోని గ్రామాల్లో సర్పంచులు, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో జెండాలను పంపిణీ చేశారు. సర్పంచ్ సలీమ-గంగన్న, కార్యదర్శి శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు గంగన్న, సిబ్బంది, ఉపాధ్యాయులు ఉన్నారు.
కురవి: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వజ్రోత్సవ కార్యక్రమాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి, ఎంపీపీ గుగులోత్ పద్మావతి-రవినాయక్ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కురవి సర్పంచ్ ఎన్ పద్మానర్సింహరావు, ఎంపీటీసీ సీహెచ్ భాస్కర్, జిల్లా సంక్షేమ అధికారిణి నర్మద, తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్, ఎంపీడీవో సరస్వతి, ఎస్సై రామునాయక్, ఎంపీవో పద్మ, వార్డు సభ్యులు నర్సింహరావు, ఐ వెంకన్న, కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది ఉమ, అరుణ, భద్రకాళి, డీ వినోద్ పాల్గొన్నారు. కొత్తూరు(జీ)లో జెండా పంపిణీని డీపీవో సాయిబాబా ప్రారంభించి మాట్లాడారు. సర్పంచ్ సుమలతా కర్నాకర్, ఎంపీవో పద్మ, కార్యదర్శి మయూరి పాల్గొన్నారు.
దంతాలపల్లి: మండలంలోని పెద్దముప్పారంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రామానుజపురంలో ఎంపీపీ వొలాద్రి ఉమ, గున్నెపల్లిలో సర్పంచ్ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. దంతాలప్లలిలో పోస్టల్శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోవిందరావు, ఎంపీవో అఫ్సర్పాషా, సర్పంచులు వెంకటనారాయణ, నాగయ్య పాల్గొన్నారు.
నెల్లికుదురు: నెల్లికుదురులో సర్పంచ్ బీరవెళ్లి యాదగిరిరెడ్డి, ఎంపీడీవో శేషాద్రి ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఉపసర్పంచ్ యాకయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు రెహమాన్, సొసైటీ మాజీ వైస్చైర్మన్ వీ శ్రీనివాస్, ఎంపీవో పార్థసారథి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కారోబార్ ర వి, అంగన్వాడీ టీచర్లు, మహిళాసంఘ సభ్యులు పాల్గొన్నారు.