నర్సంపేట, ఆగస్టు 9: యువత భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మంగళవారం నర్సంపేటలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ, ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ది ప్రారంభించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ వజ్రోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
యువకులు గాంధీజీని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీ కిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నర్సంపేట పోస్ట్మాస్టర్ దార్ల రాజేందర్, సబ్పోస్ట్మాస్టర్లు పాల్గొన్నారు.
చెన్నారావుపేట: ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. చెన్నారావుపేటలో ఆశాజ్యోతి మండల మహిళా సమాఖ్య నూతన భవన కార్యాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఇప్పటికే మండలంలోని 24 గ్రామాల్లో భవనాల నిర్మాణాలకు స్థలాలను గుర్తించినట్లు తెలిపారు.. ఇంటింటికీ న్యాచురల్ గ్యాస్ను రాబోయే రోజుల్లో నియోజకవర్గవ్యాప్తంగా అందిస్తామని పేర్కొన్నారు.
ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో మహిళలకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు పెద్ది బహుమతి అందించారు. జడ్పీటీసీ పత్తినాయక్, ఎంపీపీ విజేందర్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, జిల్లా కోఆప్షన్ రఫీ, సర్పంచ్ కుండె మల్లయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, ఎంపీడీఓ దయాకర్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణచైతన్య, గ్రామ కో ఆప్షన్ గఫార్ పాల్గొన్నారు.