గీసుగొండ, జనవరి 4 : ‘మన ఊరు-మన బడి.. బన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మండలంలోని మనుగొండ ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.12 లక్షల 96 వేల 671, 15వ డివిజన్ మొగిలిచర్ల ప్రాథమిక పాఠశాలలో రూ.13 లక్షల 24 వేల 574 చేపట్టిన విద్యుత్ సౌకర్యం, తాగు నీటి ఏర్పాటు, భవనాలకు కలరింగ్, వంట గదుల నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ గోపితో కలిసి పరిశీలించారు. జిల్లాలో పైలట్ ప్రాజక్టులుగా ఎంపికైన పాఠశాలల్లో అన్ని రకాల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేందుకు ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో విడుతల వారిగా అప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పనుల్లో వేగం పెంచాలని, అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స, డీఈవో వాసంతి, ఈఈ శంకరయ్య, డీఈ జ్ఞానేశ్వర్, ఎంఈవో సత్యనారాయణ, ఏఈ సుధాకర్, నోడల్ అధికారి రజాక్, హెచ్ఎంలు స్వరూప, దయాకర్, ఎస్ఎంసీ చైర్మన్ రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి : ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీఎస్లో ‘మన ఊరు-మన బడి’ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధులు త్వరగా పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, సర్పంచ్ నానెబోయిన రాజారాం, ఎంఈవో సత్యనారాయణ, ట్రైబల్ వెల్పేర్ డీఈ రామ్రెడ్డి, ఈఈ రవీందర్, హెచ్ఎం రామస్వామి, ఏఈ చందర్, కార్యదర్శి ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్లో..
పోచమ్మమైదాన్ : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకల సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మట్టెవాడలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇక నుంచి తరగతి గదుల్లో బ్లాక్ బోర్డు స్థానంలో గ్రీన్ బోర్డు ఏర్పాటు చేస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం పాఠశాల తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ‘ఎలా చదువుతున్నారు? మీకు డ్యుయల్ డెస్క్లు కావాలా?’ అని అడిగారు. విద్యార్థులు మాకు కావాలని చెప్పగా, సీఎం కేసీఆర్ పిల్లలందరికీ డ్యుయల్ డెస్క్లు ఏర్పాటు చేయిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో వాసంతి, డీఎస్వో శ్రీనివాస్, ఎంఈవో విజయ్కుమార్, హెచ్ఎంలు సులోచన, పూసారం తదితరులు పాల్గొన్నారు.
దాతల నుంచి విరాళాలు సేకరించాలి..
ఖిలావరంగల్ : ‘మన ఊరు-మన బడి’ పనులు ఈ నెల 20లోపు పూర్తి చేయాలని తెలంగాణ టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో ‘మన ఊరు-మన బడి’ పనుల పురోగతిపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడుతలో ఎంపిక చేసిన 223 పాఠశాలల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 10 నాటికి మండలాల్లో కనీసం రెండు పాఠశాలల్లో వంద శాతం పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. మరిన్ని సదుపాయాల ఏర్పాటుకు దాతల నుంచి విరాళాలు సేకరించాలన్నారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ.. కొన్ని మండలాల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వాటిని నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్విని తానాజీ వాకడే, డీఈవో వాసంతి తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట : నర్సంపేటలోని హనుమాన్దేవల్ ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాలను టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, డీఈవో వాసంతి సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఎన్వో రాంచందర్రావు తదితరులు పాల్గొన్నారు.