దుగ్గొండి : ప్రల్లె ప్రగతిలో భాగంగా ప్రధాన రహదారుల్లో రోడ్లకిరువైపుల మొక్కలు నాటేందుకు చేపట్టిన మల్టీ లేయర్ ప్లాంటేషన్కు రైతులు సహకరించాలని వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కోరారు. బుధవారం పల్లెప్రగతి అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామంలో నిర్మిస్తున్న డంపింగ్యార్డు, శ్మశానవాటిక నిర్మాణ పనులు, పారిశుధ్య పనులతో పాటు పల్లెప్రకృతి వనం, వర్మి కాంపోస్ట్ తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తి చేయాలన్నారు.
ప్లాంటేషన్ రోడ్లకిరువైపుల ఉన్న రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, సర్పంచులు సమతారాజు రవీందర్నాయక్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు రాజు, సంతోశ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు.