వరంగల్ : చారిత్రక హనుమకొండ జిల్లాలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే 60వ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణిలు పిలుపునిచ్చారు. ఆదివారం 60వ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ వరంగల్ 2021ను పురస్కరించుకుని వావ్ వరంగల్- హ్యాపీ హనుమకొండ ఆధ్వర్యంలో.. మథర్ థెరిసా విగ్రహం నుంచి హంటర్ రోడ్డు వరకు సైకిల్ ర్యాలీ ని వారు ప్రారంచారు.
అనంతరం హనుమకొండకి చెందిన రంజిత్ తండ్రి గత సంవత్సరం కొవిడ్ తో మరణించాడు. అతడి తండ్రి జ్ఞాపకార్థం రంజిత్ ఫిట్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఇండియాలో సైకిల్ యాత్ర చేపట్టారు. దాదాపు 4,500 కిమీ యాత్ర చేసి ఈరోజు హన్మకొండ చేరుకున్న సందర్భంగా అతడిని వారు సన్మానించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య,పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, కార్పొరేటర్ నెక్కొండ కవిత, డీసీపీ పుష్ప, ఏసీపీ జితేందర్ రెడ్డి వావ్ వరంగల్- హ్యాపీ హనుమకొండ ప్రతినిధులు, సైక్లిస్టులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.