వరంగల్ : కరోనా ప్రభావం ఆలయాలపైనా పడింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాల్లో భక్తుల దర్శనాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
తాజాగా ఇవాళ ఈ జాబితాలో వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం సైతం చేరింది. రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రేపటి నుంచి 10 రోజులపాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. విషయాన్ని గుర్తించి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పది రోజుల తరువాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.