కాజీపేట : కాజీపేట పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫాతిమా సమాంతర బ్రిడ్జి పైకి అదుపు తప్పి ఓ ట్రక్కు దూసుకెళ్లిన సంఘటన గురువారం తెల్లవారు జామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన భారీ ట్రక్ హనుమకొండ వైపు నుంచి కాజీపేట వైపుకు అతివేగంగా వచ్చి, అదుపుతప్పి నిర్మాణం అవుతున్న బ్రిడ్జి పైకి దూసుకెళ్లింది.
ఆ బ్రిడ్జిపై నున్న గుంతలలో ట్రక్కు దిగ బడిపోయింది. ట్రక్కు డ్రైవరు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.