హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11 : ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం అని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పులి రజినీకాంత్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా విధులు నిర్వర్తించిన బీఎల్వోలు, పార్టీ నియమించిన బీఎల్ఏలను మంగళవారం హనుమకొండ మచిలీబజార్లోని కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీఎల్వోలకు, బీఎల్ఏలకు శాలువాలతో సత్కరించి, చిరు కానుకలు అందజేశారు. అనంతరం పులి రజినీకాంత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమని, తెలంగాణ ఎన్నికల కమిషన్ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్లో విధులు నిర్వర్తించి ప్రజల ఓటు మ్యాపింగ్, ఎన్యుమరేషన్ ఫామ్స్ పూర్తి చేయడం, డిజిటలైజేషన్ వంటి ప్రక్రియలో బీఎల్వోలు, బీఎల్ఏలు ఎంతో కృషి చేశారని కొనియాడారు.
పౌరులు విధిగా వారి ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఎల్వోలు సుష్మ, చంద్ర, నవ్య, రాజశ్రీ, నస్రిన్, అశోక్, నజుమా, కవిత, సంతోష, అస్మా, సరస్వతి, విజయ, రాజు, కుమార్, బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు రఘు, స్రవంతి, వరుణ్, శ్యామ్, హరికృష్ణ, సుమిత్ర, నందకిషోర్, రామకృష్ణ పాల్గొన్నారు.