Child Marriage | ధర్మసాగర్ : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి జి. రామలింగం సూచించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలో జిల్లా న్యాయాసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సివిల్ జడ్జి రామలింగం, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి.అనూష, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోల్లేటి రామకృష్ణ హాజరై అవగాహన కల్పించారు.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు వివాహం చేస్తే చట్టపరమైన శిక్షలకు గురవుతారని వారు హెచ్చరించారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు వివాహం చేస్తే మానసిక పరమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.