హనుమకొండ చౌరస్తా, మార్చి 25: చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయ కుడా గార్డెన్లో దేవర విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో 5వ కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని జయంతి ఉత్సవం నిర్వహించారు. జ్యోతిప్రజ్వలన చేసి ప్రతాపరుద్రుని చిత్రపటానికి పూలమాలలువేసి ప్రతాపరుద్రుడిని స్మరించుకున్నారు. విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మించి వేయ్యి సంవత్సరాల క్రితమే రైతులు సుభిక్షంగా ఉండాలని సాగునీరు, తాగునీరుకు అనేకమైన జలాశయాలు నిర్మించారన్నారు.
ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ కాకతీయ మూలపురుషుడైన ప్రతాపరుద్రుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, ఉత్తరమున గోదావరి నది తీరం వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడని ఆయన వివరించారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి బుద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, సురేందర్, రజాలీ, జక్కుల రవీందర్యాదవ్, తాడిశెట్టి విద్యాసాగర్, తోట పవన్, కుమార్యాదవ్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, సోమయ్య, వేణుగోపాల్ పాల్గొన్నారు.