నర్సంపేట : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నాకు ఉద్యమ సహచరుడు మాత్రమే కాదు.. ఆత్మీయ సోదరుడు అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.పెద్ది సంస్మరణ సభకు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ హరీశ్ రావుతో కలిసి పల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సహచరుడిగా, ప్రజా నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
నర్సంపేట ప్రజల కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు, తెలంగాణ కోసం ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోతుందని తెలిపారు.