ములుగుటౌన్, నవంబర్ 24 : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం పాలంపేట డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా స్థానికతకు ప్రాముఖ్యతనిస్తూ సంస్కృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ, టూరిజం శాఖ సంయుక్తంగా రామప్ప అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రామప్పకు 25 కిలోమీటర్ల మేర యునెసో నిబంధనలు పాటించడంతోపాటు స్థానిక నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, కట్టూబొట్టు, గుడులను దృష్టిలో పెట్టుకొని గ్రామాల అభివృద్ధితోపాటు స్థానిక నిబంధనలు పాటించాలన్నారు.
అదేవిధంగా బయోడైవర్సిటీ రిజిస్టర్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. రామప్పకు యునెసో గుర్తింపు రావడం గొప్ప విషయమని, దానిని కాపాడుకోవాలన్నారు. అంతర్జాతీయ గుర్తింపు రావడానికి కృషి చేసిన ప్రొఫెసర్ పాండురంగారావు, పాపారావు, టూరిజం శాఖను అభినందించారు. ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ.. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఎంతో ముఖ్యమైనదని, అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించడం పూర్తయిందని, త్వరలోనే యునెసో సంస్థకు సమర్పిస్తామన్నారు. రామప్ప దేవాలయ అభివృద్ధికి ‘ప్రసాద్’ సీమ్ ద్వారా కూడా నిధులు వస్తాయన్నారు. ఈ సమావేశంలో నారాయణ చైతన్య, పాలంపేట సర్పంచ్ డోలి రజిత, ఇరిగేషన్ ఏఈ విజయభాసర్, టూరిజం శాఖ జిల్లా అధికారి శివాజి, కలెక్టరేట్ ఏవో విజయభాసర్, సూపరింటెండెంట్ విశ్వకుమార్ పాలొన్నారు.