హనుమకొండ చౌరస్తా, మార్చి 31: వరంగల్ ములుగురోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ) ప్రాంగణంలో ఏప్రిల్ 2 (గురువారం)న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా
నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ మంగనూరి చందర్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థ శ్రీనివాస సేల్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరగనుందని ఆయన తెలిపారు.
జాబ్ మేళాలో టెక్నిషన్స్, సర్వీస్ ఇంజనీర్స్గా పనిచేసేందుకు ఐటీఐ, డిప్లొమా, బి.టెక్ పూర్తిచేసిన అభ్యర్ధులు అర్హులని ప్రిన్సిపాల్ మంగనూరి చందర్ వెల్లడించారు. వీరితో పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, డీజిల్ మెకానిక్ విభాగాల్లో ఉత్తీర్ణులైన వారు.. వొకేషనల్ ఇంటర్లో ఎలక్ట్రిషియన్, ఆటోమొబైల్లో ఉత్తీర్ణులైన వారు కూడా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.
ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి శిక్షణ సమయంలో రూ.18 వేలు, ట్రైనింగ్ అనంతరం రూ.20 వేలు ఇస్తారని.. పీఎఫ్, ఈఎస్ఐ, టీఏ, డీఏలతో పాటు ఇతర బోనస్ ప్రయోజనాలు కూడా ఉంటాయని ప్రిన్సిపాల్ మంగనూరి చందర్ తెలిపారు.