హైదరాబాద్, ఆగస్టు 13 (నమసే ్తతెలంగాణ): శాసనమండలి ప్రభుత్వ హామీల కమిటీ పరిధిపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్, దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గురువారం మండలి ప్రభుత్వ హామీల కమిటీ ప్రారంభ సమావేశానికి హాజరై పలు కీలకాంశాలను ప్రస్తావించారు. సభ్యుల గౌరవాన్ని పెంచిన చైర్మన్ సుఖేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ పరిధిలోకి వచ్చే హామీలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
పార్టీలకతీతంగా కమిటీ ప్రజల పక్షాన నిలబడాలని, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం కమిటీకి ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీలకు సీడీఎఫ్ నిధులు పునరుద్ధరించాలని డిమాం డ్ చేశారు. ఎమ్మెల్సీల హక్కులు, విధులు, చట్టపరమైన రక్షణలపై సభ్యులందరికీ అవగాహన కల్పించేందుకు ఆపరేషనల్ డెఫినేషన్ డాక్యుమెంట్ రూపొందించి అందజేయాలని కోరారు. రాజ్యాంగ పరిధిలో అధికారులు పనిచేసేలా సూచనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి, వైఎస్ చైర్మన్ బండ ప్రకాశ్, కమిటీ చైర్మన్ కేతావత్ శంకర్ తదితరులు ఉన్నారు.