హనుమకొండ చౌరస్తా, నవంబర్ 27: సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ కాకతీయ హరిత హోటల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు తొలిరోజు విశేష స్పందన లభించింది. ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోళ్లు, సొంతింటి నిర్మాణంపై ఆసక్తి ఉన్న వేలాది మంది ప్రజలు షోకు తరలివచ్చారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు హాజరై ప్రాపర్టీ షోను తిలకించారు. స్టాళ్లను వీక్షించి తమకు కావాల్సిన సమాచారం తెలుసుకున్నారు. పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో వెంచర్లు, ఇళ్లు, బ్యాంకర్లు ఏర్పాటు చేసిన స్టాళ్లలో రుణాల గురించి వివరంగా తెలుసుకున్నారు. సొంతిల్లు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు కొనాలకునేవారికి ఈ షో చక్కని వేదికగా నిలిచిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు రియల్ సంస్థలను, ఇటు బ్యాంకులను ఒక్కచోటకు చేర్చి వివరాలను తెలుసుకోవడం సులభతరం చేసిన ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’కు కృతజ్ఞతలు తెలుపడంతో పాటు అభినందనలతో ముంచెత్తారు.
బంగారం కంటే ఎక్కువగా భూముల ధరలు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ బిజినెస్పరంగా డెవలప్ అవుతున్నది. భూముల రేట్లు బంగారంకంటే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ధరణి వచ్చిన తర్వాత భూ సమస్యలు తీరి, కొనుగోళ్లు, అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో, మోసపోకుండా రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకర్లతో నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.
– గండ్ర జ్యోతి, వరంగల్ జడ్పీచైర్పర్సన్
ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం శుభపరిణామం
తెలంగాణ ఉద్యమంలో నమస్తే తెలంగాణ పాత్ర మరిచిపోలేనిది. రాష్ట్ర సాధనలో అన్నివర్గాలను ఏకం చేయడంలో కీల కంగా వ్యవహరించింది. ముల్కనూరు గ్రంథాలయంలో వ్యాసరచన పోటీల వంటి మంచి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న ది. ఇప్పుడు రియల్ ఎస్టేట్, బ్యాంకర్లతో ప్రాపర్టీ షోను ఏర్పా టు చేయడం శుభపరిణామం. సొంతింటి కలను నిజం చేసుకో వాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– మారపెల్లి సుధీర్కుమార్, హనుమకొండ జిల్లా జడ్పీ ఛైర్మన్
ప్రజలకు మంచి అవగాహన వేదిక
ఆర్థికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో ప్రాపర్టీ షో ప్రజలకు అవగాహన వేదికగా నిలిచింది. బ్యాంకు లోన్ల విషయంలో ప్రజలకు సరైన అవగాహన లేదు. ఎక్కడికక్కడే స్థలాల రేట్లు పెరగడం, అధిక వడ్డీలతో ఇబ్బందు లు పడుతున్నారు. తక్కువ వడ్డీతో సులభతరంగా లోన్లు పొందేందుకు అవగాహన కల్పిస్తున్నాం. గృహలక్ష్మి స్కీం కింద సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు అమ్మాయి పేరుతో లోన్లు అందిస్తున్నాం. వ్యాపార లోన్లపై అవగాహన కల్పిస్తున్నాం.
– పంకజ్, రీజినల్ మేనేజర్, సెంట్రల్బ్యాంకు ఆఫ్ ఇండియా
వరంగల్ ప్రజలకు మంచి అవకాశం
ప్రాపర్టీషో వరంగల్ ప్రజలకు మంచి అవకాశం. సద్వినియో గం చేసుకోవాలి. బ్యాంకర్లు కూడా ముందుకొచ్చి లోన్లు ఇస్తామనడం బాగుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతోగానో ఉపయోగపడుతాయి. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో పెద్దపెద్ద కంపెనీలు,బ్యాంకులు ఒకే వేదికపైకి రావడం, విలువైన సమాచారం అందించడం శుభ పరిణామం.
– చల్లా ధర్మారెడ్డి, పరకాల ఎమ్మెల్యే
వరంగల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది
హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ బ్రహ్మండంగా అభివృద్ధి చెందుతున్నది. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే‘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీషోలో రియల్ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. విలువైన సమాచారాన్ని అందిస్తున్నా యి. కుడా లేఅవుట్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న ది. కొనుగోలుదారులకు ప్రాపర్టీ షో మంచి అవకాశం.
– అరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే
సులభతరంగా పొందేందుకు..
రియల్ వ్యాపారులు, బ్యాంకులను అనుసంధానం చేస్తూ వరంగల్లో ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం శుభసూచికం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వరంగల్ ఒకటి. సామాన్య ప్రజలు కూడా ప్రాపర్టీని సులభంగా ప్రాపర్టీని పొందేందుకు ఈ కార్యక్రమంలో ఎంతో ఉపయోగపడుతుంది. నమస్తే తెలంగాణ- తెలంగాణ టు డే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలి.
– తాటికొండ రాజయ్య, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే
అన్ని కంపెనీలు ఒకే చోట..
తెలంగాణ రాష్ట్రంలో ఎనర్జిటిక్ సిటీ వరంగల్. ఎన్నో ఐటీ కంపెనీలతో ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించింది. ఎంతో అభివృ ద్ధి చెందుతున్న నగరంలో ఇల్లు కట్టుకోవడం, కొనుక్కోవడం చాలా కష్టతరమైన ఈ రోజుల్లో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ అన్ని కంపెనీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. ఇలాంటి ప్రాపర్టీ షోలు మరిన్ని నిర్వహించాలి.
– కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్
సామాన్యులకు చేరువవుతున్నాం..
ఆకర్షణీయమైన ప్లాట్లను అతితక్కువ ధరలకు సామాన్యులకు అందిస్తూ వారికి చేరువవుతున్నాం. కాకతీయ హెరిటేజ్ టౌన్షిప్స్ ద్వారా రాంపూర్, మడికొండ ఓఆర్ఆర్కు సమీపం లో 74 ఎకరాల ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి తీసుకొ చ్చాం. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకే వేదికపై బ్యాంకర్లు, బిల్డర్స్, డెవలపర్స్ రావడం వ్యాపారపరం గా మంచి అవకాశం.
– రాఘవేంద్రరావు, సీఈవో కనకదుర్గ హోమ్స్
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్ తర్వాత ఇప్పుడు వరంగల్లో చూస్తున్నాం. సీఎం కేసీఆర్ నగరాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అన్నివర్గాల ప్రజలకు ప్రాపర్టీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీషో చక్కని వేదికగా నిలుస్తుంది. బ్యాంకర్లతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థ లు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– ఆకుల రాజేందర్, టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
ప్రాపర్టీ షో చాలా బాగుంది..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించడం చాలా బాగుంది. ఇందులో ఏర్పాటు చేసిన పలు కంపెనీల స్టాళ్లలో ప్లాట్లు, ఇండ్లు, అపార్టమెంట్ల ధరలు, హసింగ్లోన్ల వివరాలు తెలుసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి అవకాశం కల్పించారు. వరంగల్ అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో ప్రాపర్టీ షోకు మంచి స్పందన వచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులు ఒకే వేదిక ఉండడంతోచాలా విషయాలు తెలిశాయి.
– సుధీర్రెడ్డి, పరిమిళకాలనీ
మంచి విషయాలు తెలుసుకున్నా..
నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే ద్వారా ఇలాంటి ప్రాపర్టీ షో నిర్వహించి అన్ని నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థలను, బ్యాం కులను ఒకేచోటకు తీసుకొచ్చి ప్రజలకు చేరువయ్యారు. అభి వృద్ధి చెందుతున్న నగరంలో ఇండ్లు కట్టుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఎంతో మంచి అవకాశం. ప్లాట్లు, ఇండ్ల ధరలు, లోన్లకు సం బంధించిన విషయాలు తెలుసుకున్నా.
– శ్రవణ్కుమార్, సందర్శకుడు
ప్లాట్ తీసుకుందామని..
ప్లాట్ తీసుకుందామని ప్రాపర్టీ షోకు వచ్చా. ఫ్లాట్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు, లోన్లకు సంబంధించిన విషయాలు చాలా చక్కగా వివరించారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు వరంగల్లో నిర్వహించడం మొదటిసారి కావ డం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు భారీగా ప్రాపర్టీషోకు తరలివచ్చి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
-రమాదేవి, సందర్శకురాలు