ఎల్కతుర్తి, నవంబర్ 25 : సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొంత పంథాను అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, వారి వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవద్దని సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్ సూచించారు. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఎల్కతుర్తి సర్కిల్ పోలీసుల కోరిక మేరకు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్కు ఎన్ఆర్ఐ గుంటి నర్సింహారెడ్డి 28 ఫ్యాన్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి డీసీపీ అశోక్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సైబర్ నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలియని ఆన్లైన్ లింకులపై క్లిక్ చేయవద్దన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు పెట్టవద్దని సూచించారు. కొత్త వ్యక్తులతో ఆన్లైన్ చాటింగ్లు ప్రమాదంలో పడేస్తాయన్నారు. లోన్యాప్స్ బారిన పడవద్దని సూచించారు. ప్రజల్ని, విద్యార్థులను చైతన్యపరిచేందుకే సీపీ ఆదేశాల మేరకు సైబర్నేరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను చైతన్య పర్చాలని సూచించారు. సైబర్నేరాల బారిన పడితే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, ఎస్సై జక్కుల పరమేశ్, వంగర ఎస్సై మౌనిక, ప్రిన్సిపాల్ బయ్య సునీత పాల్గొన్నారు.