వేలేరు : 14 సంవత్సరాలుగా హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో పశువైద్యాధికారిగా సేవలం దించిన డాక్టర్ రణధీర్ రెడ్డి బదిలీపై కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెళ్లారు. సోమవారం వేలేరు మండల కేంద్రంలో ఆయన సేవలను గుర్తించి స్థానిక రైతులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. శాలువతో సత్కరించి కన్నీటి పర్యంతమైయ్యారు.
గత 14 సంవత్సరాలుగా వేలేరు మండల రైతులతో ఒక అవినాభావ సంబంధం ఏర్పడిందని డాక్టర్ రణధీర్ రెడ్డి సేవలను కోల్పోతుండటం బాధాకరమని రైతులు కన్నీటి పర్యంతమైయ్యారు. 15 సంవత్సరాలుగా సేవలంది పాడి పరిశ్రమతో రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా సాగేలా డాక్టర్ రణధీర్ రెడ్డి కృషి చేశారని కమ్మరిపేట సర్పంచ్ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలేరు మండల రైతులు పాల్గొన్నారు.