వర్దన్నపేట : రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల కలుషిత ఆహారం తినడంతో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కాగా, చికిత్స పొందుతున్న విద్యార్థులను తహసీల్దార్ విజయసాగర్, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిటిడిఓ నారాయణరెడ్డి, హాస్పిటల్స్ సూపరిండెంట్ వీరిన్ పిల్లలకు అందుతున్న వైద్యులు వైద్య చికిత్సను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిన్న రాత్రి కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు
చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు https://t.co/HODzWQiAeB pic.twitter.com/9xD1Cm9OYH
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2026