హనుమకొండ చౌరస్తా, మార్చి 30: హనుమకొండలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ ప్రక్రియ హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజీజ్ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరై సెలక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే ఈ ఎంపికల ముఖ్యఉద్దేశమన్నారు.
రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సెలక్షన్లలో మొదటి రోజు సోమవారం ఏడు మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా, మంగళవారం మరో ఏడు మండలాల క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోనున్నట్లు తెలిపారు. ఇంచార్జి డీవైఎస్వో శ్రీమనారాయణ మాట్లాడుతూ పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని, ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేసి హైదరాబాద్ హకింపేటలో జరిగే రాష్ర్టస్థాయి సెలక్షన్స్ పంపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు.