రాయపర్తి, సెప్టెంబర్ 26 : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో కలెక్టర్ బీ గోపితో కలిసి పర్యటించారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఆర్జీఎస్ఏ ని ధులు రూ.20 లక్షలతో చేపడుతున్న నూతన గ్రామ పం చాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీ కారం చుట్టినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రూ. వేల కోట్లతో పల్లె ప్రగతి పథకానికి అంకురార్పణ చేసినట్లు వివరించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి, పారిశుధ్య పనుల వల్ల రాష్ట్రంలో సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట పడిందన్నారు. సకల వర్గాల సంక్షేమంతో పాటు రైతు కేంద్రం గా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ రాకతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. మండలంలోని 7 నూతన గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ బానోత్ హరిసింగ్, ఆర్డీవో మహేందర్జీ, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు, డీపీవో ప్రభాకర్, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామి, సర్పంచ్ గూబ యాకమ్మ, ఎల్లయ్య, ఎంపీటీసీ భూక్యా గోవింద్నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, పంచాయతీరాజ్ డీఈ వాసం బాబూరావు తదితరులు పాల్గొన్నారు.