ఖానాపురం, నవంబర్ 6: ‘ఒక్కసారి గెలిపిస్తేనే కోట్లాది రూపాయలతో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశా. రెండోసారి గెలిపిస్తే మొదటి దానికి రెండింతలు అభివృద్ధి చేసి చూపిస్తా’ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తూరు, రంగాపురం, రాగంపేట, ధర్మారావుపేట, బాలుతండా, మర్మాగిబోడుతండా, భద్రుతండా, కొడ్తిమాట్తండా, గొల్లగూడెంతండా, బోటిమీదితండా, నాజీతండా, వేపచెట్టుతండా, మంగళవారిపేట, బుధరావుపేటలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదట కొత్తూరు దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పెద్ది తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామగ్రామాన మహిళలు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి పెద్ది బైక్ ర్యాలీ నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, జై బీఆర్ఎస్ నినాదాలతో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. గ్రామాలన్నీ గులాబీమయంగా మారాయి. పెద్ది ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ జోష్గా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పెద్ది పలు గ్రామాల కూడళ్లతో మాట్లాడారు.
గతంలో ప్రతి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులందరూ పాకాల నినాదంతో ఓట్లేయించుకొని గెలిచిన వారేనని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. కానీ, ఏ ఒక్కరూ పాకాలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గత ఎన్నికల్లో తాను పాకాలకు గోదావరి జలాలను తెస్తేనే మళ్లీ ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చానన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వెనుదిరుగకుండా మాట నిలుపుకున్నట్లు చెప్పారు. పాకాలకు గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల పాదాలు కడిగానన్నారు. అందుకు కృతజ్ఞతగా కారు గుర్తుకు ఓట్లు వేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములను క్రమద్ధీకరిస్తానని, మంగళవారిపేట భూములకు గోదావరి జలాలను మళ్లిస్తానని, అదేవిధంగా రూ. 140 కోట్లతో పాకాల పంట కాల్వలను ఆధునీకరిస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ నాయకులు గతంలో పాకాల పంట కాల్వల ఆధునీకరణను రూ. 40 కోట్లతో చేపట్టి కమీషన్లకు కక్కుర్తి పడి ఉన్న కాల్వలను పూడ్చివేశారని పెద్ది విమర్శించారు. దాని ఫలితమే నేడు చివరి ఆయకట్టు భూములకు నీళ్లు అందడం లేదన్నారు. తాను ఒక ప్రణాళికాబద్ధంగా రాత్రింబవళ్లు పనిచేస్తేనే నర్సంపేట నియోజకవర్గాన్ని ఐదేళ్లలోనే ఇంత అభివృద్ధి చేయగలిగినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా తాను ఎమ్మెల్యే కాకముందు శాసన సభ్యుడు అయిన తర్వాత జరిగిన అభివృద్ధిపై చర్చ జరగాలన్నారు. తాను సిరిమంతుడిని కాదని.. పనిమంతుడినని పెద్ది అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడడతంతో కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో కొత్త బిచ్చగాళ్లలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడమే కాకుండా నాలుగేళ్లు కనిపించకుండాపోయిన హస్తం నేతలను ప్రజలు నిలదీయాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే మన రాష్ట్రం మళ్లీ 20 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ ప్రకాశ్రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, నియోజకవర్గ ఇన్చార్జీ రాణాప్రతాప్రెడ్డి, కుంచారపు వెంకట్రెడ్డి, సర్పంచ్లు బూస రమా అశోక్, కందిక నరేశ్, బాషబోయిన ఐలయ్య, వెన్ను శ్రుతి, పూర్ణచందర్రావు, సుమన్, బాలకిషన్, పద్మావతి, పద్మ, కాస ప్రవీణ్కుమార్, రమేశ్నాయక్, శైలజ, సునీత, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: తనను మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే నర్సంపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురిజాలకు చెందిన పది మంది యువకులు పెద్ది సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. దౌడు రఘువరన్, చిన్నపెల్లి వంశీ, చిన్నపెల్లి రాజు, గొడిశాల ఆకాశ్, పంజ చందర్, చిన్నపెల్లి బాను, దౌడు రాజేశ్, తప్పెట్ల శివకుమార్తోపాటు మరికొంత మందికి పెద్ది గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, క్లస్టర్ ఇన్చార్జీలు మచ్చిక నర్సయ్యగౌడ్, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, తాళ్లపెల్లి రాంప్రసాద్, సర్పంచ్ గొడిశాల రాంబాబు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చిన్నపెల్లి నర్సింగం, మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, మండల యూత్ ఉపాధ్యక్షుడు మర్థ సతీశ్ పాల్గొన్నారు. అదేవిధంగా చంద్రయ్యపల్లికి చెందిన ఇప్ప నాగులు, ఎలకంటి శ్రీనుతోపాటు మరో ఐదుగురు బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ బరిగెల లావణ్య, పార్టీ గ్రామ అధ్యక్షుడు జర్పుల వీరన్న, నాయకులు బయ్య నవీన్, కోడెపాక రాజు, బరిగెల దశరథం, కుక్కమూడి శంకర్, రాచర్ల నాగరాజు, ఉప్పుల రాజు, పెద్ది తిరుపతిరెడ్డి, రాజన్న, శివకుమార్ పాల్గొన్నారు.
రాజేశ్వర్రావుపల్లిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో యువకులు బీఆర్ఎస్లో భారీగా చేరారు. గ్రామంలో 40 మంది యువకులు, కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలను పెద్ది ఆహ్వానించారు. బీజేపీ నుంచి గ్రామ అధ్యక్షుడు మోటం హరీశ్, పోలు ఓదెలు, వీరమల్ల రాజశేఖర్, తాటికొండ చిరంజీవి, వీరమల్ల శ్రీకాంత్, తాటికొండ సుధాకర్, తాటికొండ వినయ్, తాటికొండ అజయ్, తాటికొండ పవన్, తాటికొండ బన్నీ, తాటికొండ గణేశ్, తాటికొండ సురేశ్, తాటికొండ రంజిత్, మండల కుమార్, భాషబోయిన అభిలాశ్, తాటికొండ రామ్చరణ్, రానబోయిన సురేశ్, తాటికొండ కుమారస్వామి, పోలు రాజు, మోటం సాంబయ్య, కేశసి సాంబయ్య, మండల మల్లయ్య, తాటికొండ నరేశ్, బొజ్జ రమేశ్, ఎద్దు సాంబయ్య, జన్ను రాజేంద్రప్రసాద్, జన్ను రమేశ్, వీరమల్ల కిరణ్, వీరమల్ల కృష్ణ, పోలు కిరణ్తోపాటు మరి కొంతమంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కన్వీనర్ గోగుల రాణాప్రతాప్రెడ్డి, సర్పంచ్ బొజ్జ యువరాజ్, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి, పెద్ది తిరుపతిరెడ్డి, జర్పుల వీరన్న పాల్గొన్నారు.