నర్సంపేట, నవంబర్ 1: నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికే దక్కిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ అన్నారు. నర్సంపేటలోని 12, 13, 14, 10, 20వ వార్డులో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. మళ్లీ పెద్దిని గెలిపిస్తేనే నర్సంపేటలో రెట్టింపు అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు నల్లా మనోహర్రెడ్డి, గుంటి కిషన్, కౌన్సిలర్లు నాగిశెట్టి పద్మప్రసాద్, రుద్ర మల్లీశ్వరీ ఓంప్రకాశ్, సతీశ్ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: నర్సంపేట డివిజన్లో మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. మండలంలోని రామవరం, మహేశ్వరం, కమ్మపల్లి, రాజేశ్వర్రావుపల్లి, చంద్రయ్యపల్లిలో బీఆర్ఎస్ గ్రామ కమిటీల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా వీరన్న, క్లస్టర్ ఇన్చార్జీలు మచ్చిక నర్సయ్యగౌడ్, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, కొడారి రవన్న, కడారి కుమారస్వామి, తాళ్లపెల్లి రాంప్రసాద్, కట్ల సుదర్శన్రెడ్డి, సర్పంచ్లు వల్గుబెల్లి రంగారెడ్డి, బొజ్జ యువరాజ్, బరిగెల లావణ్య, ఎంపీటీసీలు వల్గుబెల్లి విజయ-ప్రతాప్రెడ్డి, పెద్ది శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ముగ్దుంపురం, ద్వారకపేట 7వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ పెండ్యాల జ్యోతి, 7వ వార్డు కౌన్సిలర్ మినుముల రాజు ఆధ్వర్యంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు చాపర్తి భిక్షపతి, పెండ్యాల ప్రభాకర్, బీసీసెల్ మండల అధ్యక్షుడు పెండ్యాల సదానందం, ఉప సర్పంచ్ రాజన్న, మల్లేశం, బైరి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
చెన్నారావుపేట: సబ్బండ వర్గాలు, సకల జనులు బీఆర్ఎస్తో మమేకమై ఉన్నారని ఎన్నిల మండల ఇన్చార్జి రాయుడి రవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ, పార్టీ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి అన్నారు. మండలకేంద్రంతోపాటు అమీనాబాద్, బోజెర్వు, ఎల్లాయగూడెం, కోనాపురం, ఈర్యతండా, లింగాపురంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అలాగే, పార్టీ కార్యకర్తల సమావేశమయ్యారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం పెద్ది ఆదేశాల మేరకు హంస విజయరామరాజును బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తిమ్మరాయిన్పహాడ్లో రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్ కొండవీటి ప్రదీప్కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తినాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, పార్టీ నాయకుడు బాల్నె వెంకన్న, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, జిల్లా డైరెక్టర్ తూటి శ్రీనివాస్, క్లస్టర్ బాధ్యులు వీరారెడ్డి, మాజీ ఎంపీపీ జక్క అశోక్, యూత్ కన్వీనర్ కృష్ణచైతన్యారెడ్డి, రాంరెడ్డి, సర్పంచ్ కుండె మల్లయ్య, సొసైటీ చైర్మన్ మురహరి రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసి కుమారస్వామి, పార్టీ గ్రామ అధ్యక్షుడు సాంబయ్య, కడారి సాయిలు పాల్గొన్నారు.
నల్లబెల్లి: దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న బీఆర్ఎస్కే తమ మద్దతు అని నందిగామ గ్రామంలోని దళితకాలనీ వాసులు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. ఈ మేరకు పెద్ది గెలుపు కోసం గ్రామంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ సమావేశంలో వారు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పరికి నవీన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏనాడూ దళితులను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. సమావేశంలో దళిత నాయకులు బొట్ల పణిందర్, నత్తి శ్యామ్, దూడెల రాజేశ్, సుమన్, అనిల్, కమల్హాసన్, మహేశ్, సుధాకర్, బాబు, పవన్, హరికోటి, అశోక్, నాగరాజు, విజేందర్, రాఘవులు, రాజయ్య, పోశయ్య, శంకర్, కట్టయ్య, సంజీవ పాల్గొన్నారు.
ఖానాపురం: నర్సంపేట ఎమ్మెల్యేగా మరోసారి పెద్ది సుదర్శన్రెడ్డిని గెలిపిస్తేనే నర్సంపేట ప్రగతిబాటలో నడుస్తుందని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. పెద్ది గెలుపు కోరుతూ ఖానాపురంలో ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో దాసరి రమేశ్, అశోక్, రామస్వామి, శైలజ, సునీత, పోశెట్టి, రాజు, బొప్పిడి పూర్ణచందర్, గులాంబాబా, పూ లు, అజహర్, దమయంతి పాల్గొన్నారు.
నర్సంపేట: బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రజలు ఏకమవుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి డేగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పలువురు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. పార్టీలో చేరిన వారిలో గాదగోని శ్రీనివాస్గౌడ్, మద్దిల కొమురయ్యయాదవ్, శ్యామ్యాదవ్, మర్రి క్రాంతికుమార్, గొర్రె వినయ్కుమార్, మద్దెల రాజుయాదవ్, చింతల కళావతి, ముత్యాల సుశీల, స్వరూప, మేరుగు స్వాతి, బానోత్ భద్రు, బానోత్ ఛత్రూ, ఇస్లావత్ హాలు, ఇస్లావత్ మోతీలాల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు.