లింగాలఘనపురం, నవంబర్ 24 : అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓటర్లను అభ్యర్థించారు. మండలంలోని కళ్లెం, సిరిపురం, జీడికల్, గుమ్మడవెల్లి, బండ్లగూడెం, లింగాలఘనపురంలో శుక్రవారం పర్యటించి, ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాం లో నీళ్లు, నియామకాలు లేక కార్మికులు వలస బాట ప ట్టారని.. నేడు ఆ పరిస్థితిని సీఎం కేసీఆర్ లేకుండా చేశారన్నారు. మండలంలోని మాణిక్యపురంలో ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య తన వ్యవసాయ భూమిలో నీళ్ల కోసం 58 బోరుబావులు తవ్వించినా.. చుక్క నీరు రాలేదన్నారు. పెంబర్తి, టంగుటూరు చెరువుల్లోకి గోదావరి జలాలు తరలిరావడంతో భూ గర్భజలాలు ఉబికి వచ్చాయన్నారు. ఆనాడు చుక్కా సత్తయ్య తవ్వించిన పాడుబడ్డ ఆ బోరులోకి నేడు నీళ్లు రావడంతో.. సత్తయ్య వారసులు పదెకరాల్లో వరిని సేథ్యం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవన్నారు.
ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలకు బలి కావద్దన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమాన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. తనను ఒక్కసారి ఆశీర్వదిస్తే అద్భత ఫలితాలను సాధించుకుంటామని వివరించారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఈ మండలాన్ని అభివృద్ధిలో ముందువరుసలో నిలిపి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట నాయకుడు సెవెల్లి సంపత్, బీఆర్ఎస్ మండలాధ్యక్షకార్యదర్శులు బస్వగాని శ్రీనివాస్గౌడ్, గవ్వల మల్లేశం నాయకులు మార్పు శ్రీనివాస్రెడ్డి, బర్ల మాధవి, మర్రి భాస్కర్రెడ్డి, కృష్ణారెడ్డి, దూసరి గణపతి, గుర్రం బాలరాజుగౌడ్, మీసాల కృష్ణ, ఏదునూరి వీరన్న, కత్తుల శ్రీపాల్రెడ్డి, శ్వేతపూర్ణచందర్, కాటం విజయకుమారస్వామి, రాపోలు శ్రీనివాస్, వేమళ్ల ఎల్లారెడ్డి, ఎడ్ల రాజు, కేమిడి భిక్షపతి, కేమిడి కవిత వెంకటేశ్, నీలం భిక్షపతి, గోసంగి కిష్టయ్య, ఎండీ జానీమియా, కొత్తకొండ గంగాధర్, వేముల శ్రీను, గాదెపాక విష్ణు, మహేశ్, గువ్వల బాలరాజు, సంగి రజితారాజు , తుంగ స్రవంతినాగరాజు , గుగ్గిళ్ల హరికృష్ణ, డీ భాస్కర్ రెడ్డి, కే చంద్రయ్య, గండి యాదగిరి, బీ. యాదగిరి స్వామి, చంద్రయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.