స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 19 : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెనుక దళిత సామాజికవర్గం ఉందని, ఆయన్ను గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని తాటికొండ ఉప సర్పంచ్ మారపాక రాములు అన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండలోని కడియం నివాసంలో వైస్ ఎంపీపీ చల్లా సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో తాటికొండ గ్రామ దళితులు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
దళితులు, దళిత ఉప కులాలు భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతి దళితుడు సిద్ధంగా ఉన్నారని కడియంకు రాములు తెలియజేశారు. కడియం మాట్లాడుతూ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలని, మూడోసారి కేసీఆర్ సారే సీఎం కావడమే లక్ష్యన్నారు. వార్డు సభ్యులు మారపాక రేణుకా ఎల్లస్వామి, ఎం.ప్రభుదాసు, రాజారపు మల్లయ్య, రాంచందర్, ఎం.జోజి, బొంకూరి యాదగిరి, ఎం.సంపత్, బాణాల సమ్మయ్య, ఎం.బాబు, రాజయ్య, ఆనంధం, అశోక్, ఆశీర్వాదం, కృష్ణ, సుధాకర్, దేవయ్య, యూత్ సభ్యులు మారపాక ప్రశాంత్, రాకేశ్, శ్రీనాథ్, సందీప్, ప్రీతం, రఘువర్మ, అజయ్ పాల్గొన్నారు.